సమస్యలలో చిక్కు కున్న రామ్ చరణ్ జంజీర్ సినిమా ఆలస్యం అవుతుండం తో చెర్రీ ప్రస్తుతం తన దృష్తి అంతా ఎవడు సినిమా ఫై పెట్టాడు  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న 'ఎవడు' సినిమాలో అల్లు అర్జున్ అతిధి పాత్రలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ  సినిమాలో ఒక ముఖ్య మయిన   ట్విస్ట్ ఉందట.  అంతేకాదు సినిమాలోని కథ అంతా అల్లు అర్జున్‌పైన నడుస్తుందని సమాచారం .

 కాని హీరో మాత్రం  రామ్ చరణే, అతిధిగా వచ్చిన బన్నీ  మొత్తం కథ అంతా నడుపుతాడని  ఫిల్మ్ నగర్ టాక్ . ఈ సినిమా ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా 'ఫేస్ ఆఫ్' కథను ఆధారంగా తీసుకుని నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ తేజ, శృతిహాసన్ జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న 'ఎవడు' సినిమాపై ప్రస్తుతం రకరకాల కథలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్ర అల్లు అర్జున్‌దేనట. కథ నడిచిన కొద్దిసేపటి తర్వాత ఆ పాత్ర రామ్ చరణ్‌గా మారుతుందట.

 బన్నీ వెర్షన్ బయటకు కనిపిస్తున్న రామ్ చరణ్ పాత్రలో ఉంటుందట. అంటే ఈగ సినిమాలాగ నడుస్తుంది అన్నమాట . 'ఈగ' సినిమాలో నానియే ప్రధానపాత్ర అయినప్పటికీ, సినిమా మొత్తం ఈగే కనిపిస్తుంది కదా. అలాగే చరణ్ రూపంలో బన్నీ కనబడతాడని సినీవర్గాలు అంటున్నాయి.ఈ వార్తలు ఎంతవరకు నిజాలో తెలియదు. కానీ  ఈ వార్తలు మేగాఅభిమనులను కొద్దిగా ఖంగారు పెడుతున్నాయి .ఈ మధ్యనే కొన్ని వివాదాలలో చిక్కుకుని కొంత ఇమేజ్ డేమాజ్ చేసుకున్న చెర్రీ కి ఈ ఎవడు సినిమా సినిమా హిట్ కావడం చాలా అవసరం లేకుంటే చెర్రీ కేరియర్ సమస్యలలో పడుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: