కలలు కనండి.. అంటూ యువతకు హితబోధ చేశారు అబ్దుల్ కలామ్. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. అదే జైహింద్ 2. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఆయన ఈ సినిమాని అబ్దుల్ కలామ్కి అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు.
``అందరూ చదువుకోవాలి. అప్పుడే ఈ దేశం పురోభివృద్ది సాధిస్తుంది అనేది కలామ్ మాట. ఆయన ఈ దేశ యువతకు స్ఫూర్తి. ఈ కథ కూడా విద్యావిధానం చుట్టూ నడుస్తుంది. ఈ దేశం.. ఎలా అభివృద్ది సాధిస్తుందో.. ఈ కథలో చూపిస్తున్నాం. అందుకే ఇది కలామ్కి అంకితం ఇస్తున్నాం``అని అర్జున్ చెబుతున్నారు. రూ.20 కోట్ల వ్యయంతో తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.