విలక్షణ నటుడు మోహన్ బాబు కుమార్తె లక్ష్మి ప్రసన్న ఈరోజు పెద్ద ప్రమాదం నుండి కొద్దిలో తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రయాణిస్తున్న చిన్న బోటు బోల్తా పడడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దాదాపు కిలోమీటర్ పాటు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాను అని ఈ రోజు కేరళ లో జరిగిన సంఘటన గురించి ఆమె తన ట్విట్టర్ లో స్వయంగా వెల్లడిచేసింది.

ఇక వివరాలలోకి వెళ్ళితే కేరళాలో ప్రముఖమైన అలప్పుఝా సరస్సులో మరో యాక్టర్ తో కలిసి చిన్న బోటులో లక్ష్మి వెళుతూ ఉంటే అనుకోకుండా ఆ బోటు బోల్తా పడిందట. దానితో షాక్ కు గురి అయిన లక్ష్మి దాదాపు కిలోమీటర్ నీటిలో ఈదుకుంటూ అసలు ఏమి జరిగిందో అర్ధం కాని పరిస్థితిలో ఒడ్డుకు చేరుకున్నాను అని ఆమె వెల్లడించింది. ఈ సరస్సు లో పాములు కూడా ఉంటాయని ఆమె పేర్కొంది. ఓ షిప్పింగ్ బోటు సహాయంతో ప్రాణాలతో ఎలాగో అలా బయటపడ్డాం అంటూ తన ట్విట్టర్ లో ట్విట్ చేసింది.

ఇటీవల ఆమె నిర్మించిన “గుండెల్లో గోదారి” సినిమా తరువాత ప్రస్తుతం ఈ మంచు వారి అమ్మాయి ఏ సినిమాలు చేయడం లేదు. అయితే ఆమె ఒక ఇంగ్లీష్ ప్రొడక్షన్ సంస్థ తో కలిసి “బాస్మతి రైస్” అనే సినిమాలో నటిస్తుంది అనే వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆమె ఈ ప్రమాదం నుండి బయటకు రావడం మంచువారి కుటుంబానికే కాకుండా తెలుగు సినిమాను ముఖ్యంగా లక్ష్మి ప్రసన్న ను అభిమానించే వారందరికీ ఆనందింపదగ్గ విషయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: