క‌థానాయిక‌గా ఓ వెలుగు వెలిగింది సిమ్రాన్‌. దాదాపు అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ ఒక‌టికి రెండుసార్లు జోడీ క‌ట్టింది. ఆ త‌ర‌వాత కృష్ణ‌భ‌గ‌వాన్ రేంజుకి ప‌డిపోయింది. ఆ త‌ర‌వాత బుల్లి తెర‌పై ఎంట్రీ ఇచ్చింది. ఒక్క‌సారి టీవీల‌వైపు వెళ్లాక‌.. తిరిగి వెండి తెర‌మీద హ‌ల్ చ‌ల్ చేయాల‌నుకోవ‌డం అత్యాసే. కానీ సిమ్రాన్ మ‌ళ్లీ ఆ ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టింది.ముఖ్యంగా త‌మిళ సినీ రంగంలో.

.. అవ‌కాశాల కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది ఈ వెట‌ర‌న్ భామ‌. అయినా ఎవ్వ‌రూ ఛాన్స్ ఇవ్వ‌లేదు. అమ్మా, వ‌దిన లాంటి ఓల్డ్ పాత్ర‌లు వ‌చ్చాయిగానీ ఒప్పుకోలేదు. చివ‌రికి.. అవే దిక్క‌య్యాయి ఇప్పుడు. సూర్య‌-త్రిష జంట‌గా న‌టిస్తున్న ధ్రువ‌న‌క్ష‌త్రంలో సిమ్రాన్ కీ ఓ పాత్ర ద‌క్కింది. ఇందులో అమ్మ‌గా న‌టిస్తోంది సిమ్రాన్‌. ఇది వ‌ర‌కు సూర్య, స‌న్నాప్ కృష్ణ‌న్ సినిమాలో కూడా సూర్య‌కు త‌ల్లిగా న‌టించింది.

ఇప్పుడు మ‌రోసారి ముస‌లి అవతారంలో క‌నిపించ‌బోతోంది.
ఇలా అమ్మ పాత్ర‌ల‌కు సెటిలైపోయిన‌ట్టేనా? అంటే మాత్రం సిమ్రాన్ ఒప్పుకోవ‌డం లేదు. ``వ‌య‌సు పెరిగింది. ఇప్పుడు కూడా క‌థానాయిక‌గా క‌నిపిస్తాంటే కుద‌ర‌దు. అయితే ఎప్పుడూ ఇలాంటి పాత్ర‌ల్లోనే క‌నిపించాల‌ని ఏముంది?  ప‌రిశ్ర‌మ‌లోని ద‌ర్శుకులు న‌న్ను ఎలా చూడాల‌నుకొంటే అలా క‌నిపిస్తా`` అంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: