ఖైదీ మ్యానియాకు సంబంధించి వస్తున్న వార్తలను చూసి అందరి మైండ్స్ బ్లాంక్ అయిపోతున్నాయి.  తన సినిమాకు ఈ రేంజ్ లో క్రేజ్ వస్తుందని తానే ఊహించలేదు అని మెగా స్టార్ చిరంజీవి చెపుతున్నాడు అంటే ‘ఖైదీ’ మ్యానియా ఏ విధంగా షేక్ చేస్తోందో అర్ధం అవుతుంది.  

మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం బెంగుళూర్ లోని ఒక సినిమా దియేటర్ కు సంబంధించి ‘ఖైదీ’ టిక్కెట్లను వేలం పెట్టగా ఆసినిమాకు సంబంధించి మొదటిరోజు మొదటి షోకు సంబంధించిన 3 టిక్కెట్లను 36 లక్షలకు ఒక అభిమాని వేలంలో ఆ టిక్కెట్లను దక్కించుకున్నాడు అని వార్తలు రావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.  ఈ వార్తలలో ఎన్ని వాస్తవాలో తెలియకపోయినా ఇప్పుడు ఈ న్యూస్ మెగా అభిమానులకు మంచి జోష్ ను ఇస్తోంది. 

గతంలో బాలకృష్ణ సినిమాకు సంబంధించి అమెరికాలో ఒక ఓవర్సీస్ ప్రేక్షకుడు ఇలాంటి భారీ మొత్తంతో బాలయ్యబ్ సినిమా మొదటిరోజు మొదటి షో టిక్కెట్ ను వేలం పాటలో కొన్నాడు అన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. అయితే చిరంజీవి సినిమాకు సంబంధించి ఇలా వేలం పాటలో ఇంత భారీ మొత్తానికి ఇలా టిక్కెట్లు కొనడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. 

సామాన్యంగా ఇటువంటి అభిమానుల హంగామా దక్షిణాది సినిమా రంగానికి సంబంధించి రజినీకాంత్ సినిమాలు విడుదల సందర్భంలో తమిళనాడులో జరుగుతూ ఉంటుంది. అయితే సినిమాలకు దూరం అయిపోయి 9 సంవత్సరాలు దాటిపోయి రాజకీయనాయకుడిగా ఏమాత్రం రాణించలేకపోయిన చిరంజీవికి ఇప్పుడు ఏర్పడుతున్న క్రేజ్ ను చూస్తూ ఉంటే ప్రజలు ఒక వ్యక్తి పై ఏర్పరుచుకున్న అభిప్రాయాలను ఎంత తొందరగా మార్చుకుంటారో అన్నది ఇదే నిదర్శనం.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: