తెలుగు ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష ఈ గత సంవత్సరం ‘బాబు బంగారం’ చిత్రంతో అలరించారు.  ఆ మధ్య మల్టీ స్టారర్ చిత్రాలలో నటించి మంచి హిట్స్ కొట్టిన ఈ సీనియర్ హీరో ఆ తర్వాత రీమేక్ ల బాట పట్టాడు.  ఈ సంవత్సరం సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ‘గురు’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ ఒకటి రిలీజ్ కావడం మంచి స్పందన రావడం జరిగింది.

తాజాగా మరో టీజర్ రిలీజ్ అయ్యింది. వెంకీ ‘గురు’చిత్రంలో బాక్సింగ్ కోచ్‌గా డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. బాలీవుడ్‌లోనే కాక కోలీవుడ్‌లోనూ సంచలన విజయం సాధించిన ‘సాలా ఖద్దూర్’ని తెలుగులో ‘గురు’గా తెరకెక్కిస్తున్నారు.  ఈ చిత్రంలో వెంకటేష్ చాలా ఎమోషనల్ గా, సిరియస్ గా కనిపిస్తున్నాడు.

స్టూడెంట్స్ కి కఠినమైన శిక్షకుడిగా కనిపిస్తున్నారు.. వెంకి చెప్పే డైలాగ్స్ ‘ మీరు నేను చెప్పిందే వింటారు.. చెప్పిందే తింటారు.ఇల్లు, వాకిలి, ప్రేమ, దోమ, చెత్తాచెదారం అన్ని పక్కనపెట్టి ఒళ్లొంచి ట్రై చేయండి .. ’ అని టీజర్‌లో వెంకీ చెప్పే డైలాగ్‌ అదుర్స్ అనిపించింది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రితికా సింగ్ కథానాయికగా నటించింది. సంతోష్ నారాయణ్ స్వరాలు అందించాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: