ఇప్పుడు ఫిలింనగర్ లో ఎక్కడ చూసినా రామ్ చరణ్ నిర్మించిన ‘ఖైదీ నెంబరు 150’ కలక్షన్స్ హోరు గురించే చర్చలు జరుగుతున్నాయి. 10 సంవత్సరాల తరువాత మెగా స్టార్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాకు టాక్ తో సంబంధం లేకుండా కలక్షన్స్ విషయంలో ఇప్పటికీ బ్రహ్మరధం పడుతూనే ఉన్నారు ప్రేక్షకులు. 

అయితే ఈ సినిమా బాక్స్ ఫీస్ దగ్గర కలెక్షన్ల దుమ్ము రేపుతుండటంతో రికార్డులు ఒకటి తర్వాత మరొకటి బద్ధలైపోతున్నాయి. ‘ఖైదీ నంబరు 150’ తొలి రోజు కలెక్షన్ల గురించి వస్తున్న వార్తలు మెగా అభిమానుల్ని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఖైదీ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర అంశం ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది.

ఈసినిమాకు సంబంధించి చిరు రెమ్యూనరేషన్ మినహాయిస్తే.. ఈ సినిమాకు పెట్టి ఖర్చు దాదాపు రూ.30 కోట్లు అని ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజునే రూ.47 కోట్ల షేర్ వచ్చేసిందని చెబుతున్నారు. ఇప్పుడు ఇదే న్యూస్ రామ్ చరణ్ ను కొన్ని సమస్యలలోకి నెడుతుందా ? అంటూ కొందరు సందేహాలు మరికొందరు అనుమాలు వ్యక్తం చేస్తున్నారు.  

చిరంజీవి నటించిన ఈ భారీ సినిమాకు మొదటి రోజు కలెక్షన్లతోనే లాభాల బాట పడితే మొత్తం ఈసినిమా రన్ పూర్తి అయి అకౌంట్ క్లోజ్ అయ్యేనాటికి ఇంకెంత కలక్షన్స్ వస్తాయో అన్న విషయమై ఆ సక్తికర చర్చలు ఫిలింనగర్ లో జరుగుతున్నాయి.   అయితే ఇంత భారీ స్థాయిలో వస్తున్న ‘ఖైదీ’ కలక్షన్స్ గురించి లీకులు ఇస్తున్న మెగా కాంపౌండ్ ఐటీ శాఖ అధికారులు కూడా ఈ విషయాలు వింటూ ఉంటారు అన్న భయం లేకుండా ఈ లీకులు ఇస్తున్నారా ? లేదంటే ఈ విసయమై మరొక వ్యూహాన్ని మెగా కాంపౌండ్ అనుసరిస్తుందా ? అన్న  విషయామై ప్రస్తుతం ఫిలింనగర్ లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: