‘జనతా గ్యారేజ్’ సంచలన విజయం తరువాత ఎన్నో కధలు విన్న జూనియర్ ఎన్టీఆర్ చిట్ట చివరకు  డైరెక్టర్ బాబీ చెప్పిన ఒక వెరైటీ కధ నచ్చడంతో ఆకధకు ఒకే చెప్పిన విషయం తెలిసిందే.  ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో  కళ్యాణ్ రామ్ తీస్తున్న ఈమూవీ షూటింగ్ ఈనెల 10వ తారీఖు నుండి ప్రారంభంకాబోతోంది.  ఈచిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంచేయడం ఒక ప్రత్యేక ఆకర్షణ.   

ఇది ఇలాఉండగా ఈచిత్రం కోసం బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా నటించడానికి అంగీకరించాడు అని వార్తలు రావడం మెగా కాంపౌండ్ కి షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ‘ఖైదీ నెంబర్ 150’ రీమేక్ మొదలు పెడుతున్నప్పుడు ఒరిజినల్  తమిళ్ ‘కత్తి’  మూవీలో విలన్ గా నటించిన నీల్ ముఖేష్ గురించి చాలాగట్టిగా మెగా కాంపౌండ్ ప్రయత్నించింది. 

అయితే చిరంగీవి ‘ఖైదీ’ లో విలన్ గా నటించడానికి నితిన్ నీల్ ముఖేష్ ఏమాత్రం ఆసక్తి కనపరచలేదు. అయితే లేటెస్ట్ గా ఆనటుడినే జూనియర్ కొత్త మూవీలో విలన్ పాత్రకు ఎంపిక చేయడం అతడు ఓకె చేయడం ఇప్పుడు టాలీవుడ్ హాట్ న్యూస్ గా మారింది. 

దీనితో మెగా  స్టార్ కు నో చెప్పిన బాలీవుడ్ యాక్టర్ ను జూనియర్ పట్టేసాడు అంటూ ప్రచారం జరుగుతోంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్‌కు చెందిన సాంకేతిక నిపుణుడు వాన్సీ హార్ట్‌వెల్‌ పని చేస్తున్న విషయం తెలిసిందే. టెక్నాలజీని ఉపయోగించి మనుషులను విభిన్న రూపాల్లో కనిపించేలా చేయడం వాన్సీ ప్రత్యేకత. 

ఈమూవీలో త్రిపాత్రాభినయం చేస్తున్న జూనియర్ మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నాడు. జూనియర్ ఈసినిమాలో పోషిస్తున్న పాత్రల పేర్లు ‘జై’, ‘లవ’, ‘కుశ’ కావడంతో ఈమూడు పేర్లను కలిపి ఈసినిమా టైటిల్ ను ‘జై లవకుశ’ గా పెట్టాలని ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: