దశాబ్ధకాలం పైగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న మా టివి ఇప్పుడు స్టార్ మాగా అవతరించింది. ఈరోజు మరో విశేషం ఏంటంటే మెగాస్టార్ బుల్లితెర మీద మీలో ఎవరు కోటిశ్వరుడుతో రాబోతున్నాడు. అందుకే సరిగ్గా 9 గంటల 30 నిమిషాలకు మా టివి స్టార్ మాగా మారడమే కాకుండా అదే బంధం సరికొత్త ఉత్తేజం అంటూ ట్యాగ్ లైన్ కూడా చెప్పాడు.


ఇక స్మాల్ స్క్రీన్ పై మెగాస్టార్ తనదైన శైలిలో నమస్తే.. ప్రణామం.. సబ్ కో సలాం.. అని ఎంట్రీ ఇచ్చాడు. కార్యక్రమం గురించి ఇంట్రెస్టింగ్ గా చెప్పిన మెగాస్టార్ బుల్లితెర అభిమానులను తన అభివాదంతో ఆకట్టుకున్నాడు. చిరు విరామం.. చిటికెలో వచ్చేస్తా.. డొంట్ గో ఎవే.. అంటూ తన మార్క్ డైలాగ్ తో అదరగొట్టాడు. 


మీలో ఎవరు కోటిశ్వరుడు మూడు సీజన్లలో కింగ్ నాగార్జున హోస్ట్ గా ఉన్నారు. నాలుగో సీజన్ లో మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చాడు. సిని పరిశ్రమలో ఇన్నేళ్లు హీరోగా ఉన్నా మెగాస్టార్ చిరంజీవి బుల్లితెర మీదకు వచ్చింది మాత్రం ఈ షో ద్వారానే.. మరి బుల్లితెర మీద మెగాస్టార్ హవా ఎలా కొనసాగుతుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: