‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత జూనియర్ ఎన్నో ఆలోచనలు చేసి మరెందరో చెప్పిన కథలు విని చిట్టచివరకు దర్శకుడు బాబి చెప్పిన కథకు బుట్టలో పడిన విషయం తెలిసిందే. ‘జై లవ కుశ’ అన్న టైటిల్ ఈసినిమాకు పెట్టబోతున్నారు అన్న ప్రచారం ఇప్పటికే జరగబోతోంది. 

అయితే అనూహ్యంగా ఈ మూవీకి సంబంధించిన కథ దర్శకుడు బాబి ఒక తమిళ చిత్ర ఆధారంగా వ్రాసాడు అన్న గాసిప్పులు ఇప్పుడు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి.  హడావిడి చేస్తున్న ఈ వార్తల ప్రకారం దాదాపు 10 సంవత్సరాల క్రితం కోలీవుడ్ లో విడుదలైన అజిత్ నటించిన ‘వరలారు’ మూవీ కథను జూనియర్ లేటెస్ట్ సినిమా పోలి ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది. 

2006 లో విడుదలైన ‘వరలారు’ మూవీ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ మూవీలో కూడా అజిత్ మూడు పాత్రలలో నటించాడు.  ఈసినిమా కథను కొద్దిగా మార్పులు చేర్పులు చేసి దర్శకుడు బాబి జూనియర్ సినిమా కోసం కథగా మార్చాడు అన్న ప్రచారం జరుగుతోంది. 

తెలుస్తున్న సమాచారం మేరకు జూనియర్ ఈ సినిమాలో నటిస్తున్న మూడు పాత్రల స్వభావం కూడ బయట పడుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్విన్స్ గా కనిపిస్తాడట. మూడవ పాత్ర ఏమిటంటే ఆ రెండు పాత్రలకి తండ్రిగా ఉంటాడని తెలుస్తోంది. జూనియర్ నటిస్తున్న ఈ తండ్రి పాత్ర విలన్ ఛాయలతో ఉండబోతోంది అని టాక్. 

ఇంకా పూర్తిగా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఈ సినిమా కథకు సంబంధించిన లీకులు బయటకు వస్తూ ఉండటంతో ఈసినిమాను నిర్మిస్తున్న నిర్మాత కళ్యాణ్ రామ్ వస్తున్న ఈ వార్తలలో ఎన్ని నిజాలు ఉన్నాయి అన్న విషయమై లోతుగా పరిశీలనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి రానున్న రోజులలో ఈ ‘జై లవ కుశ’ ఇంకా ఎన్ని మలుపు తిరుగుతుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: