మలయాళ హీరోయిన్ భావన అత్యాచార వార్తలు బయటకు వచ్చిన తరువాత ఎందరో హీరోయిన్స్ తమకు ఇండస్ట్రీలో జరుగుతున్న వేధింపుల పై పెదవి విప్పుతూ ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి నటి సుచిత్ర కూడ చేరిపోయింది. కోలీవుడ్ టాప్ యంగ్ హీరో ధనుష్ తనను వేధిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేయడమే కాకుండా ధనుష్ తనపై దాడికి పాల్పడ్డారని ట్వీట్ చేయడం కోలీవుడ్ మీడియాకు హాట్ న్యూస్ గా మారింది. 

ఇప్పటికే ధనుష్ తన తల్లి తండ్రుల విషయంలో కోర్ట్ కేసులు ఎదుర్కుంటూ కష్టాలలో ఇరుకున్న నేపధ్యంలో ఇప్పుడు సుచిత్ర ఇటువంటి కామెంట్స్ చేయడంతో ధనుష్ ను మరింత పీకలలోతు కష్టాలలోకి నెట్టేసింది. అయితే ధనుష్ పై ఇంతటి తీవ్ర ఆరోపణలు చేసిన సుచిత్ర మీడియా ముందుకు రాకపోవడంతో సుచిత్ర ప్రవర్తనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ధనుష్‌తోపాటు ఆయన సిబ్బంది కూడా దాడి చేశారు. ‘నాపట్ల దారుణంగా ప్రవర్తించారు. నా చేతులపై గాయాలయ్యాయి. అందుకు సాక్షం ఇదిగో’ అంటూ ఫొటోలను ట్వీట్ చేసింది సుచిత్ర. అంతేకాకుండా ఇషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవన్‌ పై అభ్యంతకరమైన ట్వీట్ చేసింది సుచిత్ర. 

అక్కడ భారీ సెక్స్ కుంభకోణం జరుగుతోంది అంటూ సుచిత్ర ట్విట్ చేయడం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది.  అయితే ఈమె చేసిన ట్విట్స్ లో ఎన్ని యదార్దాలో తెలుసుకుందామని మీడియా వర్గాలు ఆమెతో మాట్లాడటానికి ఎంత ప్రయత్నించినా ఆమె అందుబాటులోకి రాకపోవడంతో సుచిత్ర నడిపిన ఈ వ్యవహారం పై ఈ ట్విట్స్ పై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

తమిళ చిత్ర పరిశ్రమలో సుచిత్ర గాయనిగా సుపరిచితురాలు అవ్వడమే కాకుండా ఆమె పాడిన పాటలు కోలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యాయి. గతేడాది తమిళ కమెడియన్ కార్తీక్ కుమార్‌ను వివాహాం చేసుకున్న సుచిత్ర ఇప్పుడు చేసిన వివాదాస్పద ట్విట్స్ తో సంచలనంగా మారింది. అయితే ఆమె లేటెస్ట్ గా మరొక షాకింగ్ ట్విస్ట్ ఇస్తూ తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని చెపుతూ ఉండటం మరింత ఆశ్చర్యాన్ని గురి చేస్తోంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: