సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్ తమన్నా. ప్రస్తుతం తమన్నా నటిస్తున్న చిత్రాలు వరుస విజయాలను అందుకుంటున్నాయి. అలాగే తనకి పలు ఇండస్ట్రీలోని హీరోలతో మంచి పరిచయాలు ఉండటంతో మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. తను నటిస్తున్న మూవీలకి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో శాటిలైట్ రైట్స్ కి డిమాండ్ ఉండటం తనకి ప్లస్ అని చెప్పవచ్చు.


ఇలా తమన్నా ప్రస్తుతం ఫుల్ బిజీ షెడ్యూల్స్ లో కనిపిస్తుంది. ఇదిలా ఉంటే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తమన్నా-శ్రుతిహాసన్ ల మధ్య గట్టి పోటీ నెలకొంది. శ్రుతిహాసన్ ఏ హీరోతో  సినిమాలు చేస్తుందే…అదే హీరోతో సినిమాలను చేయటానికి తమన్నా ప్రయత్నాలు చేస్తుంది. అలాగే తమన్నా నటిస్తున్న హీరోల సరసన సినిమాలు చేయటానికి శ్రుతిహాసన్ సైతం ప్రయత్నాలు చేస్తుంటారు.


ఇలా వీరు ఒకరికి ఒకరు పోటీ వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. తాజాగా తమన్నా ఓ బాలీవుడ్ ఆఫర్ ని దక్కించుకుంది. దీనికి కోసం టాలీవుడ్ లో ఇద్దరు హీరోల మూవీలను పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. వీటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…‘హిమ్మత్ వాలా, తుటాక్ తుటాక్ తూటియా’ వంటి హిందీ సినిమాల్లో నటించిన తమన్నా, అవకాశం వచ్చినప్పుడల్లా బాలీవుడ్ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పుడు జాన్ అబ్రహం నటించనున్న ‘చోర్ నికల్ కే భాగ’ సినిమాలో తమన్నా నటించనుంది.


గతంలో జాన్ అబ్రహం హీరోతో శ్రుతిహాసన్ వెల్ కం సీక్వెల్ లో నటించింది. ఇప్పుడు శ్రుతిహాసన్ నటించిన హీరో కాబట్టి…వెంటనే తమన్నా, జాన్ అబ్రహం తో నటించేందుకు రంగం సిద్ధం చేసుకొని ఫైనల్ గా ఆఫర్ ని దక్కించుంది. ఇక ఈ ఆఫర్ కోసం తెలుగులో జూ.ఎన్టీఆర్, రామ్ వంటి హీరోల మూవీల్లో హీరోయిన్ ఆఫర్స్ ని పక్కన పెట్టేసిందని అంటున్నారు. ఇక తమన్న నటిస్తున్నఈ బాలీవుడ్ చిత్రాన్ని అమర్ కౌశిక్ డైరెక్ట్ చేస్తుండగా జేఏ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి జాన్ అబ్రహం నిర్మిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: