ఈ మద్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో వారసుల హవా కొనసాగుతున్న సమయంలో విశ్వనటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో అన్న తర్వాత హీరో, హీరోయిన్ల మద్య ఎఫైర్లు కామన్..కొంత మంది డేటింగ్ లో కూడా ఉంటారు. ఇప్పుడు కమల్ కూతురు శృతి కూడా బ్రిటన్ నటుడు మైఖేల్ కోర్సేల్ పీకల్లోతుల్లో ఉందట. శృతి హాసన్, మైఖేల్ కలిసున్న ఫొటోలు ఇటీవల మీడియాలో వచ్చాయి.
గత నెలలో వీరిద్దరూ ముంబై ఎయిర్పోర్టులో మీడియా కంట పడ్డారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, ఇద్దరికీ రిలేషన్షిప్ ఉందని బాలీవుడ్లో పుకార్లు షికార్లు చేశాయి. ఇటీవల శ్రుతి, మైఖేల్ కలిసి లండన్ నుంచి చెన్నై వచ్చారని, అక్కడి నుంచి రుషికేష్ వెళ్లి కొద్దిరోజులు అక్కడ గడిపారు. రిషికేష్ పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అక్కడి నుంచి నేరుగా వచ్చి హుషారుగా కాటమరాయుడు షూటింగ్లో పాలుపంచుకొన్నారు.
వీరి బంధంపై అనేక కథనాలు వచ్చినా కమల్ హాస్ మాత్రం పెదవి విప్పలేదు. చివరికి తీవ్రస్థాయికి చేరుకోవడంతో మైఖేల్తో ప్రేమలో ఉన్న విషయంపై కమల్ హాసన్ తన కూతురు శృతిపై సీరియస్ అయ్యాడట. ఈ విషయం కమల్ హాసన్ దృష్టికి రావడంతో ఆయన కలత చెందినట్టు సన్నిహితులు చెప్పారు.