జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి డైరక్షన్ లో జై లవకుశ సినిమా చేస్తున్నాడు. కొద్దికాలంగా తనకున్న మాస్ ఇమేజ్ కు దూరంగా సినిమాలు తీస్తూ హిట్ అందుకుంటున్న తారక్ గ్యారేజ్ హిట్ తో తానో ఫ్యామిలీ హీరో అనిపించుకున్నాడు. ఇక తారక్ తర్వాత సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ తో చేస్తారని తెలుస్తుంది.


అసలైతే గ్యారేజ్ తర్వాత వచ్చిన 6 నెలల గ్యాప్ లోనే ఈ సినిమా చేయాల్సి ఉన్నా అది కుదరలేదు. ఓ పక్క అఆ తర్వాత కూడా లాంగ్ గ్యాప్ తీసుకున్న త్రివిక్రం ఈ నెలలోనే పవర్ స్టార్ తో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ఈ ఇద్దరు కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసుకుని తర్వాత కలిసి సినిమా చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్.     


ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే తారక్ కోసం త్రివిక్రం దగ్గర కథ ఏది లేదట. మహేష్ కోసం త్రివిక్రం రాసుకున్న కథ సరదాగా తారక్ కు చెప్పగా తనకు ఆ కథే కావాలని అంటున్నాడట. మహేష్ ఇమేజ్ కు సరిపడే కథ కాబట్టి తాను ఈ కథ ఇవ్వలేనని చెప్పినా జూనియర్ మాత్రం మహేష్ కోసం రాసిన కథనే తనతో సినిమా తీయమని బలవంతం చేస్తున్నాడట.


త్రివిక్రం కూడా దాదాపు ఓకే అన్నట్టు టాక్. ఇక మహేష్ విషయానికొస్తే ప్రస్తుతం మురుగదాస్ సినిమా పూర్తి కాగానే వెంటనే కొరటాల శివతో భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు మహేష్. ఆ తర్వాత సినిమా త్రివిక్రంతో చేయాల్సి ఉంది. మహేష్ కోసం రాసిన కథ ఎలాగు తారక్ కు వాడుతున్నాడని తెలుస్తుంది కాబట్టి మళ్లీ మహేష్ కోసం కొత్త కథ రాస్తాడేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: