కోలీవుడ్ క్రేజీ హీరో కార్తి మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన సినిమా చెలియా. తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేసిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. మణిరత్నం మార్క్ పక్కాగా కనిపిస్తున్న ఈ సినిమాలో తన మ్యాజిక్ పాయింట్స్ మిస్ చేశాడు. ముఖ్యంగా సినిమా రెండో భాగం చాలా స్లోగా వెళ్లడం ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయలేదు.


ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో సినిమా తీసే ఆలోచనలో ఉన్నాడు మణిరత్నం. చెలియా రిజల్ట్ ను బట్టి మణిరత్నంతో చేయాలా వద్దా అని నిర్ణయించుకోవాలనుకున్నాడు. చెలియా టేకింగ్ పరంగా మణిరత్నం మార్క్ చూపిస్తున్నా సినిమా మాత్రం వర్క్ అవుట్ అయినట్టు కనిపించట్లేదు. అందుకే చెలియా టాక్ వల్ల చెర్రి షాక్ అయ్యాడని అంటున్నారు.


ప్రస్తుతం సుకుమార్ తో సినిమా చేస్తున్న ఆ తర్వాత మణిరత్నంతో సినిమా చేయాలని అనుకున్నాడు చెర్రి. మణిరత్నం చెప్పిన ఓ లైన్ కూడా ఓకే అన్నాడట. కొద్దిరోజులుగా ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న మణిరత్నం ఓకే బంగారంతో ట్రాక్ ఎక్కేశాడని అన్నారు. కాని మళ్లీ చెలియాతో ఆ ట్రాక్ తప్పేశాడు.


మరి ఇలాంటి టైంలో మణిరత్నంతో చెర్రి రిస్క్ చేస్తాడా ఏంటని మెగా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. బ్రూస్ లీ ఫ్లాప్ తర్వాత ధ్రువతో దుమ్ముదులిపిన చెర్రి మళ్లీ మణితో సినిమా అంటే నెగటివ్ కామెంట్స్ వినపడుతున్నాయి. ఫైనల్ డెశిషన్ ఏంటో తెలియదు కాని చెలియా ఫలితం ఈ ఇద్దరు కలిసి చేసే సినిమా మీద పడిదని చెప్పొచ్చు.  



మరింత సమాచారం తెలుసుకోండి: