ప్రస్తుతం మెగాహీరోలలో మంచి స్పీడు మీద ఉన్నది ఎవరు అని చూస్తే అల్లుఅర్జున్, రామ్ చరణ్ అని చెప్పవచ్చు. అయితే వీరిద్దరి కంటే ఇంకాస్త దూకుడు చూపిస్తున్న నవతరం మెగాహీరో సాయిధరమ్ తేజ్. సాయిధరమ్ తేజ్ స్పీడు అల్లుఅర్జున్ కంటే కాస్త ఎక్కువుగా ఉందని అంటున్నారు. సినిమా ప్లాపులు, సక్సెస్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలను సాయిధరమ్ తేజ్ ప్లాన్ చేసుకుంటున్నారు.


ఓ చిత్రం సెట్స్ మీద ఉండగానే మరో చిత్రానికి సంబంధించిన షూటింగ్ లో సాయిధరమ్ తేజ్ పాల్గొనటం మెగాహీరోలకే షాక్ ని ఇస్తుంది. ఇంత వేగంగా చిత్రాలను ఎలా విడుదల చేసుకుంటున్నాడు? అనేది మెగాహీరోలకి అంతుపట్టని విషయంలా మారింది. ఇదిలా ఉంటే సాయిధరమ్ తేజ్ కొత్త చిత్రం ‘జవాన్’ తొలి షెడ్యూల్ షూటింగ్ ని పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. బివిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సాయిధరమ్ తేజ్ గట్టి నమ్మకాన్ని పెట్టుకున్నాడు.


కెరీర్ ప్రారంభంలోనే సాయి ధరమ్ తేజ్ పవర్ఫుల్ పాత్రలను చేయటంతో ఇది తన కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. అంతే కాకుండా సాయి ధరమ్ తేజ్ కి మెగాహీరోలకి ఉన్న క్రేజ్ ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో బాగా తెలుసు. అందుకే తన ప్రతి మూవీ ఆడియో ఫంక్షన్స్ లో అయినా…తన మూవీలలో అయినా మెగాహీరోలకి సంబంధించిన డైలాగ్స్ తో ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసేలా ప్లాన్ చేసుకుంటారు. ఇది సాయి ధరమ్ తేజ్ కి ఎంతో ప్లస్ అవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా వినాయక్ వద్ద నుండి సాయి ధరమ్ తేజ్ కి ఓ కథ వెళ్ళిందట. ఇప్పటి వరకూ వినాయక్ ఇంతటి పవర్ఫుల్ కథని బన్నీకి కూడ చెప్పలేదు.


అలాంటిది సాయి ధరమ్ తేజ్ కోసం వినాయక్ ప్రత్యేకమైన కథని సిద్ధం చేయటం అనేది అల్లుఅర్జున్ కి షాకింగ్ లా మారింది. ఈ విధంగా సాయి ధరమ్ తేజ్ ఒక వైపు సినిమాలు చేస్తూనే…మరోవైపు ఇండస్ట్రీలోని డైరెక్టర్స్ ని మాయ చేసే పనిలో ఉండటం చూసి…ఈ హీరో చేస్తున్న మల్టీ టాక్స్ కి అల్లుఅర్జున్ సైతం షాక్ అవుతున్నాడు. ఇక జవాన్ మూవీకి సంబంధించిన వివరాల్లోకి వెళితే ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మొత్తంగా ఈ చిత్రం ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: