ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన వివరాల్లోకి వెళితే..హీరోయిన్ గా నటిస్తున్న సమంత రెమ్యునరేషన్ ఓ రేంజ్ లో ఉందని అంటున్నారు. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న వీటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ –సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.


ప్రస్తుతం ఈ చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే కొన్ని రోజుల గ్యాప్ తరువాత మళ్ళీ ఈ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకోనుందని అంటున్నారు. ఇక తాజాగా జరిగిన షెడ్యూల్స్ లో రామ్ చరణ్, సమంతలపై ఒక పాటను చిత్రీకరించారు. అయితే ఈ మూవీలో సమంత పాత్రపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. హీరోయిన్ సమంత పాత్రకు మాటలుండవని, మూగ పాత్ర చేస్తోందని…అలాగే చూపులేని అమ్మాయిగా నటిస్తుందని పుకార్లు పుట్టుకొచ్చాయి.


వీటన్నింటిని క్లారిఫై చేస్తు చిత్ర యూనిట్ ఇదంతా అబద్దం అని తేల్చేసిన సంగంతి తెలిసిందే. సమంత మూగ పాత్ర గాని,చూపులేని పాత్ర గాని చేయడంలేదని తేల్చి చెప్పింది. అయితే ఈ మూవీలొ సమంత పాత్ర చాలా బలంగా ఉంటుంది. కథలో కీలకం సమంత పాత్రనే అంటున్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పాత్రను సమంత చేయటానికి కారణం కూడ సమంత లుక్స్ అని అంటున్నారు.


ఇన్ని విషయాలను గమనించిన సమంత…తనకి రెండు కోట్ల రూపాయలు ఇస్తే గాని డేట్స్ ఇవ్వనంటూ చెప్పింది. అయితే సమంత అడినంత రెమ్యునరేషన్ ని చిత్ర నిర్మాతలు ఇవ్వటానికి రెడీగా ఉన్నారని అంటున్నారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న రామ్ చరణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడని అంటున్నారు. మైత్రీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: