అక్కినేని హీరో అఖిల్ నటించిన మొదటి మూవీ అఖిల్. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద భారీ డిజాస్టర్ ని అందుకుంది. దీంతో అఖిల్ హీరోగా భవిష్యత్ ఒక్కసారిగా చీకటి అయింది. డెబ్యూ మూవీతోనే అఖిల్ కి కోలుకోలేని దెబ్బ తగిలిందని అంటున్నారు. అయితే హీరో అఖిల్ తన మొదటి మూవీ విషయంలో తనే సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఏ విషయంలోనూ నాగార్జున ఇన్వాల్వ్ మెంట్ ని తీసుకోలేదు.


సలహాలకే పరిమితం అయ్యాడు. ఇక అఖిల్ మూవీ రిలీజ్ తరువాత హీరో అఖిల్ కి నాగార్జున సలహాల విలువ ఏంటో తెలుసొచ్చిందని అంటున్నారు.  ఇక తాజాగా తన రెండో మూవీకి సంబంధించిన షూటింగ్ ని శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈసారి అక్కినేని నాగార్జున ఎలాంటి సమాచారం లేకుండా అఖిల్ రెండవ చిత్రాన్ని ప్రారంబించారు. ఈ నెల 4వ తేదీ నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. దర్శకుడు విక్రమ్ కుమార్ అఖిలపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.


హైదరాబాద్ లోనే అత్యధిక షెడ్యూల్ జరగనుందని అంటున్నారు. నాగార్జున సైతం స్వయంగా సెట్స్ కు వెళ్లి అఖిల్ మూవీపై పర్యవేక్షణ చేస్తున్నారు. ఈసారి అఖిల్ చేస్తున్న ఈ సినిమా తప్పక సక్సెస్ సాధిస్తుందని అంటున్నారు. మరో రెండు చిత్రాల వరకూ అఖిల్, నాగార్జున చూపించిన బాటలోనే నడవాలనేది అఖిల్ కి నాగార్జున పెట్టిన కండిషన్. దీంతో అఖిల్ సైతం తన మూవీలకి సంబంధించిన విషయాలపై తను ఎటువంటి జోక్యం చేసుకోవటం లేదని అంటున్నారు.


ఇక దర్శకుడు ఈ కథని చక్కగా తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు. ఈ మూవీని అక్కినేని సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ పై నిర్మించటం జరుగుతుంది. విక్రమ్ కుమార్, అఖిల్ బాడీ లాంగ్వేజ్ ని బాగా స్టడీ చేసిన తరువాతనే ఈ కథని రాసుకున్నాడని అంటున్నారు. అందుకే అఖిల్ కి ఈ మూవీ భారీ సక్సెస్ ని ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి విక్రమ్ కుమార్, రామ్ చరణ్ తో సినిమా చేయాల్సి ఉండగా…నాగార్జున కోరిక మేరకు అఖిల్ కోసం పనిచేయాల్సి వచ్చిందని అంటున్నారు. ఇక అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: