కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ధనుష్ కి మంచి పేరు ఉంది. తన మూవీలు రిలీజ్ అవుతున్నాయంటే ధనుష్ కి బ్రహ్మరధం పట్టే అభిమానులు ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో తన పొజిషన్ సైతం సామాన్యమైనది కాదు. రజినీకాంత్ అల్లుడుగా, హీరోగా ధనుష్ అన్ని రకాల భోగాలు అనుభవిస్తున్నారు. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా ధనుష్ ని నిద్రలేకుండా చేస్తున్న విషయం ఒక్కటే.


మదురై కు చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు మద్రాస్ హై కోర్ట్ లో ధనుష్ తమ కుమారుడే అని పిటిషన్ వేసినప్పటి నుంచి ఈ హీరోకి నిద్రలేకుండా అయింది. అయితే పిటిషన్ లో వారు చెప్పిన గుర్తులు అనేవి తన శరీరంలో లేకుండా ధనుష్ చాలానే ప్రయత్నాలు చేశాడని ఆ దంపతులు అంటున్నారు. దీంతో ఆ దంపతులు ఇప్పుడు డీఎన్ఏ టెస్టులకైనా సిద్ధమని మరోమారు పిటిషన్ దాఖలు చేశారు.


అయితే ఒకవైపు కోర్టు చుట్టు ధనుష్ కథ నడుస్తుంటే…మరోవైపు ఇవేమి తనకు తెలియనట్టుగా ధనుష్ తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. అయితే కోలీవుడ్ కి చెందిన టాప్ హీరోయిన్స్ మాత్రం ధనుష్ ని కొంత దూరం పెడుతున్నారని అంటున్నారు. తల్లిదండ్రులు అంటూ వచ్చిన వారి సమస్యని వెంటనే తేల్చకుండా ఇలా ఆల్యస్యం చేయటంతో ధనుష్ ఏదో దాస్తున్నాడని హీరోయిన్స్ సైతం భావిస్తున్నారు.


ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ ధనుష్ కచ్ఛితంగా మోసగాడే అని ముద్రని వేస్తున్నారంట. ఇంకొన్ని రోజులు గడిస్తే ధనుష్ ని హీరోయిన్స్ అదొలా చూడటం ఖాయం అని అంటున్నారు. అయితే ధనుష్ తన గతంలో పుట్టుమచ్చలు చెరిపేసుకునట్లుగా కోర్టు తీర్పు ఇవ్వటం అనేది ఎన్నో అనుమానాలు తలెత్తేలా చేస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: