టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారిన న్యూస్ మెగా మల్టీస్టారర్ మూవీ `చ‌ర‌ణ్‌అర్జున్`.ఈ న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుండి మెగా ఫ్యాన్స్‌కి ఇది సూప‌ర్ న్యూస్‌లా మారింది. రామ్ చ‌ర‌ణ్‌ అల్లుఅర్జున్ ఇద్ద‌రూ ఒకే ఫ్రేమ్‌లో చూసుకునే ఛాన్స్ ఈసారి అభిమానుల‌కు క‌ల‌గ‌నుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఆ ఇద్ద‌రి కోసం ఓ పవర్ఫుల్ క‌థ సిద్ధం అయింది.


గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారే సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన బడ్జెట్ పై రకరకాల వార్తలు వస్తున్నాయి. అత్యంత భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించాలనేది నిర్మాత ఆలోచన అని అంటున్నారు. నిర్మాత అయిన అల్లుఅరవింద్ కి రామ్‌చ‌ర‌ణ్–అల్లు అర్జున్ ఇద్ద‌రినీ ఒకే ప్రేమ్ లో చూడాలి అనేది తన కోరిక.


అందుకే ఇది తనకి డ్రీమ్‌ అని అంటున్నారు. `చ‌ర‌ణ్‌అర్జున్` అనే టైటిల్‌తో సినిమా నిర్మించాల‌ని చాలా కాలంగా ట్రై చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు అల్లుఅరవింద్ పూర్తి బాధ్యతలను ఎత్తుకున్నారు. ఈ చిత్రాన్ని ఒకే సారి తెలుగు, తమిళ్, మళయాళం బాషల్లో చిత్రీకరించనున్నారు. ఇందులో మోహన్ లాల్ నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక బడ్జెట్ విషయానికి వస్తే…ఈ చిత్రాన్ని దాదాపు 90 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారని అంటున్నారు.


ఇద్దరు మెగాహీరోలు నటిస్తున్నారు కాబట్టి ఈ మాత్రం ఉండాల్సిందే అని అల్లుఅరవింద్ భావిస్తున్నరనేది ఇండస్ట్రీ టాక్స్. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు ఎప్పుడు బయటకు వస్తాయి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇదివ‌ర‌కే `ఎవ‌డు` చిత్రంలో బ‌న్ని, చ‌ర‌ణ్ క‌నిపించినప్పటికీ అది పూర్తి స్థాయిలో సాధ్యపడలేదు. అందుకే ఇప్పుడు వస్తున్న చిత్రంతో అభిమానుల కోరిక తీర్చనున్నారని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: