తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియచేసిన సినిమా బాహుబలి. మొదటి పార్ట్ ఎంత సంచలన విజయం అందుకుందో అదే రేంజ్లో ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ హంగామా ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ పీక్ స్టేజ్ లో చేస్తున్నారు. 


ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన సెంథిల్ కుమార్ చిత్ర విశేషాలను పంచుకుంటూ బాహుబలి కన్నా ఈగ సినిమా తనకు గొప్ప అని అన్నాడు. బాహుబలిలో క్యారక్టర్స్ పక్కన గ్రాఫిక్స్ ఉంటాయి కాని ఈగ లో లీడ్ క్యారక్టర్ గ్రాఫిక్స్ బేస్డ్ కాబట్టి ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డామని అంటున్నాడు సెంథిల్ కుమార్.


తనకు పర్సనల్ గా మాత్రం బాహుబలి రెండు పార్టుల కన్నా ఈగ సినిమానే గ్రేట్ అనేస్తున్నాడు. సెంథిల్ చెప్పిన విషయాలు టెక్నికల్ గా ఓకే కాని సినిమా పరంగా చూస్తే బాహుబలి చాలా పెద్ద సినిమా. తెలుగు సినిమాగా మొదలైన ఈ సినిమా భాషలన్నిటిని ఒక్కటి చేస్తూ ఇండియన్ సినిమాగా ప్రమోట్ చేయబడడం విశేషం.   


ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ ఎత్తున ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సెంథిల్ మాటలు బాహుబలి ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తున్నా ఓ కెమెరా మన్ గా ఈగ బెస్ట్ అని చెప్పడం తన గట్స్ ను తెలియచేస్తుందని అంటున్నారు.     



మరింత సమాచారం తెలుసుకోండి: