ప్రపంచం ఇప్పుడు ఎంతో టెక్నాలజీతో ముందుకు సాగుతుంది. ఒక్క స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉంటే చాలు ప్రపంచం మన చేతిలో ఉన్నట్లనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో లేనిది ఏదీ లేదు. అయితే ఈ టెక్నాలజీతో ఎన్ని ఉపయోగాలు ఉన్నా..అదే స్థాయిలో వినాశనం కూడా పొంచి ఉంది. ఈ మద్య సోషల్ మీడియా సినిమాల పాటిల శాపమై పోతుందీ అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి ఓ సినిమా తెరకెక్కిస్తే..అది కొన్ని గంటల వ్యవధిలోనే నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.
మరీ దారుణమైన విషయం ఏంటంటే కొన్ని సినిమాలు రిలీజ్ కాక ముందే నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. గతంలో అత్తారింటికి దారేది చిత్రం రిలీజ్ కి ముందు నెట్ లో రావడంతో షాక్ కి గురయ్యారు చిత్ర బృందం. అంతే కాదు షూటింగ్ స్పాట్ ఫోటోలు లీక్ కావడం కామన్ అయ్యింది. గతంలో బాహుబలికి సంబంధించి ఓ యుద్ద సన్నివేశం సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో పెద్ద రగడ జరిగింది. ఇప్పుడు ఇదే పరిస్థితి బాహుబలి 2 కి కూడా పొంచి ఉందా అన్న అనుమానాలు చిత్ర యూనిట్ ని కలవరపెడుతున్నాయి.
బాహుబలి 2 రిలీజ్ కి ముందే లీక్ అయ్యిందని , షోలు పడ్డాయని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన నిర్మాత శోభు యార్లగడ్డసెన్సార్ కోసం ఆయా దేశాల్లో , రాష్ట్రాలలో షో వేశారు కాబట్టి సెన్సార్ సభ్యులు చూస్తున్న సమయంలోని ఫోటోలే సోషల్ మీడియాలో నానుతున్నట్లు భావిస్తున్నామని స్పష్టం చేసాడు శోభు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంత మంది పనికట్టుకొని మరీ సినిమా నెట్ లో పెడతారేమో అనుమానాలు కూడా లేకపోలేదు.