గత రెండు రోజులుగా మీడియాను షేక్ చేసిన సాయి ధరమ తేజ్ నిహారికల పెళ్లి వార్తలు మెగా ఫ్యామిలీలో విపరీతమైన టెన్షన్ ను క్రియేట్ చేసాయి. ఈ వార్తలలోని యదార్దాలను తెలుసుకోవడానికి అనేకమంది ప్రముఖులు కూడ ఆ శక్తి కనపరిచినట్లు టాక్. సాయిధరమ్ తేజ్, నిహారికలకు త్వరలో పెళ్ళి జరగడానికి మెగా కుటుంబంలోని ఇరు వర్గాల పెద్దలు కూడ వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు జోరందుకున్నాయి. 

సాయిధరమ్ తేజ్, నిహారిక వరుసకు బావమరదళ్లు కావడంతో ఆ వార్తలో తప్పేమీ లేదని అందరూ భావించారు. సాయిధరమ్ తేజ్ హీరోగా కూడా మెప్పిస్తుండటంతో మెగా ఫ్యామిలీకి తగిన అల్లుడేనని మెగా అభిమానులు కూడ అనుకున్నారు.  అయితే ఆ వార్తలో నిజం లేదని సాయిధరమ్ తేజ్ వివరణ ఇవ్వడంతో ఇది రూమర్ గా తేలిపోయింది.

గత రెండు రోజులుగా హాదావిడి చేస్తున్న ఈ వార్తల పై సాయిధరమ్ తేజ్ సోమవారం స్పందించాడు. తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా మీడియాకు ఓ ప్రకటన విడుదల చేయించాడు. దాంతో ఈ గందరగోళానికి తెరపడింది. 

సాయిధరమ్ తేజ్ ప్రకటన సారాంశం ప్రకారం ‘నిహారిక నేను పెళ్లి చేసుకోనున్నట్టు మీడియాలో వ‌స్తున్న‌ వార్త‌ల‌న్నీఅవాస్త‌వం, కొన్ని మీడియా వర్గాలలో ఈ విష‌యంపై వార్త‌లు రావ‌డం బాధాక‌రం. మేమిద్ద‌రం చిన్నతనం నుంచి ఒకే కుటుంబంలో క‌లిసి పెరిగాం.. ఆమె నాకు సిస్టర్ లాంటింది. మా కుటుంబస‌భ్యులు కూడా మమ్మల్నీ అన్నాచెల్లెళ్లుగానే భావిస్తారు’ అని తేజ్ తన వివరణను ఈ ప్రకటన ద్వారా తెలియచేసారు.

అంతేకాదు నిహారిక పెళ్లికి సంబంధించి ఇలాంటి వార్త‌లు రావ‌డం బాధాక‌రం అని అంటూ  ఆధారాలు లేని వార్త‌లు మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తాయి కాబట్టి ఇలాంటి విషయాలు రాసేముందు ఒక‌టికి రెండుసార్లు ధృవీక‌రించుకోంటే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు సాయి ధరమ్ తేజ్. అదేవిధంగా ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం అని అంటూ తన బాధను వ్యక్త పరిచాడు ఈ మెగా యాంగ్ హీరో. మెగా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన ఈ వార్తల పై ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పటితో ఈ గాసిప్పులకు తెర పడతాయి అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: