ప్రస్తుతం అందరిచూపు బాహుబలి పార్ట్ 2 కలక్షన్స్ మీదే ఉంది. ఊహించినట్టుగా 1000 కోట్లు అది కూడా పది రోజుల్లోనే సాధించడం సినిమా పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. బాహుబలి సినిమా అది సృష్టిస్తున్న సంచలనాల గురించి ఇప్పటిదాకా నోరు విప్పని బాలీవుడ్ హీరోలు సినిమా 1000 కోట్ల గ్రాస్ వచ్చాక రెస్పాండ్ అయ్యారు.


పొడి పొడి మాటలతో రాజమౌళిని పొగుడుతున్నా ఓ తెలుగు సినిమా ఈ ఘనత సాధించిందని వారిలో ఏ మూలనో హర్ట్ చేస్తుందని అర్ధమవుతుంది. అందుకే ఆమీర్ ఖాన్ చేయబోయే థగ్స్ ఆఫ్ హిందోస్తాన్ మూవీని బాహుబలిని మించి భారీ రేంజ్ లో తీయాలని చూస్తున్నారట. ఆమీర్ ఖాన్ నటిస్తున్న ఈ సినిమాను ధూం 3 డైరక్టర్ విజయ్ కృష్ణ 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని చూస్తున్నారు.


బాహుబలి సినిమాను తలదన్నేలా ఈ సినిమా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. బాలీవుడ్ సత్తా ఏంటో ఈ సినిమా చూపించాలని వారి ఆలోచన. బాహుబలితో ఓవర్సీస్ లో హాలీవుడ్ సినిమాలకు పోటీగా సినిమా వసూళ్లను రాబట్టొచ్చని చూపించింది. అందుకే ఈ సినిమాను కూడా అదే రేంజ్ తీసి హిస్టరీ క్రియేట్ చేయాలని చూస్తున్నారు.


స్క్రిప్ట్ దగ్గర నుండి తగిన జాగ్రత్తలు ఒకటికి రెండు సార్ల్య్ చెక్ చేసుకుంటున్నారట. అంతేకాదు పైరేట్స్ ఆఫ్ కరేబియన్ లా ప్రాంచైజీలుగా కూడా మార్చాలని చూస్తున్నారు. సో మొత్తానికి బాహుబలి దెబ్బకు బాలీవుడ్ బడా హీరోలు తమ సత్తా చాటేందుకు నడుం బిగించారని చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: