మెగాస్టార్ 151వ సినిమాగా రాబోతున్న ఉయ్యాలవాడ నర సింహారెడ్డి సినిమాకు బాహుబలి టచ్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదెలా అంటే బాహుబలి సినిమాలో విలన్ గా అదరగొట్టిన భళ్లాలదేవ అలియాస్ రానాను ఉయ్యాలవాడ నర సింహారెడ్డి సినిమాలో తీసుకునే ఆలోచనలో ఉన్నారట.


సురేందర్ రెడ్డి డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమా రాం చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తాడని తెలుస్తుంది.  150 ఏళ్ల క్రితం జరిగిన యధార్ధ గాధతో తెరకెక్కే ఈ సినిమాను బాహుబలి రేంజ్ లో తీయాలని అనుకుంటున్నారు. ఖైది నంబర్ 150తో తన స్టామినా ఏంటో చూపించిన మెగాస్టార్ ఉయ్యాలవాడ నర సింహారెడ్డిగా కూడా అదే రేంజ్ రిజల్ట్ అందుకోవాలని సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారట.  


బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందని తెలుస్తుంది.. బాహుబలికి పనిచేసిన టెక్నిషియన్స్ ను కూడా ఈ సినిమాకు తీసుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా రానాకు ఓ స్పెషల్ రోల్ ఫిక్స్ చేశారట. ప్రస్తుతం రానాతో కథా చర్చలు జరుపుతున్నారట. అఫిషియల్ గా కొద్దిరోజుల్లో ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. బాహుబలి సినిమా 1000 కోట్లతో ఇండియన్ సినిమా స్టామినాను ప్రూవ్ చేసింది ఈ క్రమంలో అదే రేంజ్ లో రాబోతున్న పిరియాడికల్ మూవీ ఉయ్యాలవాడ నర సింహారెడ్డి కూడా కలక్షన్స్ టార్గెట్ భారీగానే ఉంది.      


పరుచూరి బ్రదర్స్ ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం చేయగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. ఇక త్వరలో సినిమా ముహుర్తం ఫిక్స్ చేస్తారని తెలుస్తుంది. మరి మెగాస్టార్ 151వ సినిమా ప్రెస్టిజియస్ గా రాబోతున్న ఉయ్యాలవాడ నర సింహారెడ్డి ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: