తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో ప్రభంజనం సృష్టించిన చిత్రం ‘బాహుబలి 2’.  ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా ఏంటో నిరూపించిన చిత్రం బాహుబలి 2.  దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం బాహుబలి, బాహుబలి 2.  ఇక భారత దేశంలో ఈ మద్య పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడమే ఆలస్యం వెంటనే పైరసీలు బయటకు రావడం జరుగుతుంది.  దీనిపై ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు తీసుకు వచ్చినా..ఎన్ని పైరసీ మాఫియా మాత్రం ప్రతిసారీ రెచ్చిపోతూనే ఉన్నారు.  
Image result for baahubali 2 posters
తాజాగా ఈ పైరసీదారులు ఒక అడుగు ముందుకు వేసి నిర్మాతలను బెదిరించే స్థాయికి చేరుకున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపుతున్న బాహుబలి 2   పైరసీ చేశామని మర్యాదగా 2 కోట్లు ఇస్తే మంచిదని లేదంటే ఇంటర్నెట్ లో సినిమా మొత్తం పెట్టేస్తామని వార్నింగ్ ఇచ్చారు . దాంతో బాహుబలి నిర్మాతలు సిసిఎస్ పోలీసులను ఆశ్రయించడంతో పక్కా ప్లాన్ ప్రకారం పాట్నా లో రాహుల్ శర్మ అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు.  
Image result for baahubali 2 posters
గతంలో కూడా పెద్ద సినిమాలు రిలీజ్ అయిన రోజే ఇంటర్ నెట్ లో పెట్టడం..పైరసీ చేయడం చేస్తూ నిర్మాతలకు ఎంతో నష్టాన్ని తీసుకు వస్తున్నారు.  ఏప్రిల్ 28న బాహుబలి 2 రిలీజ్ కాగా అదే రోజున దాదాపు 50 నిమిషాల సినిమా ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టారు కూడా . అయితే బాహుబలి యూనిట్ తో పాటు పేస్ బుక్ యాజమాన్యం కూడా స్పదించడం తో దాన్ని వెంటనే ఆపేసారు . వరల్డ్ వైడ్ గా 1500 కోట్ల దిశగా దూసుకుపోతోంది బాహుబలి 2 .


మరింత సమాచారం తెలుసుకోండి: