టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి, స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ పేర్లు ఎక్కువుగా వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా ఇండస్ట్రీలో వస్తున్నాయి. ఇక తాజాగా బాహుబలి2 మూవీ హిట్ తరువాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని స్టార్ ప్రొడ్యూసర్స్ అంతా వీరిద్దరివైపే చూస్తున్నారు.

దీంతో విజయేంద్రప్రసాద్ తన ఆలోచనలకి కొత్త పంథాని జతచేశాడు. తను కూడ రాజమౌళిలాగే కమర్షియల్ మైండ్ తో ఆలోచించటం మొదలు పెట్టారు. ఏకంగా రాజమౌళితోనే బిజినెస్ ప్లాన్ ని రూపొందించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...‘భజరంగీ భాయ్ జాన్, బాహుబలి’ వంటి భారీ సినిమాలకు కథలందించిన విజయేంద్రప్రసాద్ స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రం ‘శ్రీవల్లి’. 

ఈ మూవీని ఎప్పుడో రిలీజ్ చేయాల్సి ఉండగా...ఇంకా దానిని రిలీజ్ చేయలేదు. బాహుబలి2 సక్సెస్ తరువాత శ్రీవల్లీ మూవీని రిలీజ్ చేయాలని చూశారు. ఇప్పుడు బాహుబలి2 మూవీ భారీ సక్సెస్ ని పొందటంతో...బాహుబలి2 కథా రచయితగా విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో వస్తున్న చిత్రంగా శ్రీవల్లీ మూవీకి మంచి మార్కెట్ ని క్రియేట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి కావటంతో ఈ మూవీ విడుదలకి రెడీ అయింది.

తాజాగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ బాహుబలి రెండవ పార్ట్ విడుదలయ్యాక వచ్చే పేరు‘శ్రీవల్లి’ సినిమాకు ఉపయోగపడుతుందని సినిమాను ఆలస్యం చేశాం అని స్పష్టం చేశారు. ఇప్పుడు బాహుబలి2తో వచ్చిన తన ఇమేజ్ ని ఉపయోగించుకొని...అలాగే కొడుకు ఇమేజ్ తో ఈ మూవీని దేశ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అదే క్రేజ్ తో శ్రీవల్లీ మూవీని హిందీలో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: