ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ ‘రోబో-2’. సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో2 పూర్తైన వెంటనే ‘కబాలి’ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. దీనికి సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కబాలి మూవీ భారీ సక్సెస్ ని సాధించటంతో కబాలికి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది.


మాఫియా నైపథ్యంలో రూపొందనున్న ఈ సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాక్స్ ని క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్ ను కేటాయించటానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీపై పాజిటివ్ టాక్స్ ఎలా వినిపిస్తున్నాయో...నెగిటివ్ టాక్స్ సైతం అంతే విధంగా వినిపిస్తున్నాయి.


కబాలి మూవీ భారీ కలెక్షన్స్ ని నమోదు చేసుకున్నప్పటికీ....చాలా థియోటర్స్ నష్టపోయాయి అనే రిజల్ట్ అంతటా ఉంది. అయితే ఇవేమి పట్టించుకోకుండా పా.రంజిత్ కబాలి సీక్వెల్ కి రెడీ కావటంతో డిస్ట్రిబ్యూటర్స్ ఈసారి హీరోకి గట్టిషాక్ ఇచ్చారని అంటున్నారు. నేరుగా రజనీకాంత్ వద్దకు వెళ్లిన కొంత మంది డిస్ట్రిబ్యూటర్స్...గతంలో కబాలి మూవీకి జరిగిన నష్టం కారణంగా ఈసారి కబాలి సీక్వెల్ కి ఏరియా రైట్స్ విషయంలో రేట్లు తగ్గించాలని కోరారు.


ఒకవేళ అలా జరగకపోతే..ఈ మూవీని కొన్ని ఏరియల్లో ప్రదర్శించే ప్రసక్తే లేదని అంటున్నారు. ఇక కబాలి మూవీకి ‘బాహుబలి-2’ చిత్రం కోసం పని చేసిన విఎఫ్ఎక్స్ నిపుణుడు పెటే డ్రాపర్ ను ప్రాజెక్టులోకి తీసుకోవటంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత హైప్ క్రియేట్ అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: