బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్న అద్భుతమైన పాత్రలు పోషించి ముఖ్యంగా తల్లి, వదిన పాత్రల్లో తనదైన మార్క్ చాటుకున్న ప్రముఖ బాలీవుడ్ నటి  రీమా లాగూ (59) గుండెపోటుతో మృతి చెందారు. గత రాత్రి ఆమెకు ఛాతీలో నొప్పి రావడంతో ​కుటుంబసభ్యులు హుటాహుటీన అంథేరీలోని కోకిలాబెన్‌ ధీరూబాయ్‌ అంబానీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రీమా మరణించారు.  ఇండస్గ్రీలోకి వచ్చే ముందు ఆమె మరాఠీ రంగస్థలంపై ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన రీమా తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
Veteran actor Reema Lagoo passes away
అయితే బాలీవుడ్ లోకి వచ్చే ముందు ఆమె .  దూరదర్శన్ ధారావాహికలతో కెరీయర్‌ ప్రారంభించిన ఆమె కయామత్ సే కయామత్ తక్ (1988) చిత్రంతో వెలుగులోకి వచ్చారు.   ఈ చిత్రంలో ఆమె జూహీచావ్లా తల్లి పాత్ర పోషించారు.  బాక్స్‌ ఆఫీస్‌ వద్ద కలెక్షన్ల మోత మోగించిన మైనే ప్యార్‌ కియా చిత్రంలో సల్మాన్ ఖాన్ తల్లిగా నటించింది. అలాగే  హమ్‌ ఆప్కే హై కౌన్‌, కుచ్‌ కుచ్‌ హోతా హై, హమ్‌ సాత్‌ సాత్‌ హై, కల్ హో నా హో తదితర చిత్రాల్లో తల్లి పాత్రలు పోషించారు.

పాపులర్‌ టీవీ షో ‘తూ తూ మే మే’, శ్రీమన్‌ శ్రీమతిలోనూ నటించారు. ప్రస్తుతం రీమా నామకరణ్‌ అనే సీరియల్‌లో విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. మరాఠీ నటుడు వివేక్ లాగూను వివాహం చేసుకున్న రీమా లాగూకు కుమార్తె మృన్మయీ లాగూ ఉన్నారు.  కాగా రీమా మృతితో బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆమె మృతిపట్ల బాలీవుడ్‌ నటీనటులు సంతాపం తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: