ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ తను నిర్మించే సినిమా కథ విషయంలోనే కాకుండా ఆసినిమా బడ్జెట్ విషయంలో కూడ చాల జాగ్రత్తలు తీసుకుంటాడు అన్న కామెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. అందువల్లనే దిల్ రాజ్ టాప్ హీరోల నుండి చిన్న హీరోల వరకు వరసగా సినిమాలు చేస్తు ఎవరూ ఊహించని రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు.

ప్రస్తుతం దిల్ రాజ్ తీస్తున్న సినిమాలలో ఒకటి బన్నీతో చేస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’ అయితే మరొకటి వరుణ్ తేజ్ తో తీస్తున్న ‘ఫిదా’ మీడియం బడ్జెట్ సినిమాగా ప్రారంభం అయిన ఈసినిమాకు దర్శకుడు శేఖర్ కమ్ముల తీసుకుంటున్న అతి జాగ్రత్తలు వల్ల ఈసినిమా ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియక దిల్ రాజు చాలా అసహనంగా ఫీల్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు అని అంటున్నారు. ఈసినిమా పూర్తి అయి విడుదల అయ్యే సమయానికి దసరా సీజన్ దాటిపోయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. దీనికితోడు ఈసినిమా షూటింగ్ ఒక చోట కాకుండా అనేక లోకేషన్స్ తో ముడిపడటంతో పాటు ఫారన్ షెడ్యూల్స్ కూడ ఉండటంతో ఈమూవీ బడ్జెట్ దిల్ కంట్రోల్ దాటిపోయింది అని వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాను 70 రోజులలో పూర్తి చేస్తాను అని మాట ఇచ్చిన శేఖర్ కమ్ముల తన కంట్రోల్ తప్పటంతో ఈమూవీ షూటింగ్ కనీసం 100 రోజులకైనా పూర్తి అవుతుందా అన్న టెన్షన్ దిల్ రాజ్ కు ఏర్పడినట్లు టాక్. దీనికితోడు వరుణ్ తేజ్ మార్కెట్ కూడ బాగా పడిపోవడంతో ఇప్పటికే బడ్జెట్ పెరిగిపోయిన ఈసినిమా మార్కెట్ కావడం కష్టం అని అంటున్నారు. దీనితో దిల్ రాజ్ కు ‘ఫిదా’ కష్టాలు మొదలు అయ్యాయి అంటూ సెటైర్లు పడుతున్నాయి..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: