బుల్లితెర మీద తన యాంకరింగ్ తో అలరిస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న రష్మి గౌతం సినిమాల్లో కూడా తన ముద్ర వేసుకుంటుంది. గుంటూర్ టాకీస్ లాంటి సినిమాలో నటించిన అమ్మడు ఓ రేంజ్ హాట్ ఇమేజ్ సంపాదించింది. ఇక వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునే క్రమంలో అమ్మడు అలాంటి సినిమాలనే చేస్తూ వస్తుంది. ప్రస్తుతం రష్మి నటిస్తున్న సినిమా 'అంతకుమించి'. సతీష్ జై హీరోగా నటిస్తున్న ఈ సినిమా హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ జరుపుకుంటుంది.   


ఈ సినిమా గురించి రష్మి మట్లాడుతూ ఇలాంటి పాత్ర తాను ఇప్పటివరకు చేయలేదని.. సినిమాలో తన పాత్ర పేరు మధు ప్రియ అని, కథ కథనం ఆసక్తిగా సాగే ఈ సినిమా కొత్తగా ఉంటుందని చెబుతుంది. జాని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సతీష్ నిర్మిస్తున్నారు. గుంటూర్ టాకీస్ తర్వాత రష్మి చేయడానికి అరడజను సినిమాలు చేసినా అవి అంత మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. మరి రాబోతున్న ఈ 'అంతకుమించి' సినిమా అయినా రష్మి కెరియర్ కు బూస్టప్ ఇస్తుందేమో చూడాలి.     


బుల్లితెర మీద హాట్ ఇమేజ్ తో సినిమాల్లో కూడా అదే రేంజ్ ఛాన్సులు పట్టేస్తున్న రష్మి ఈమధ్య తన హవా తగ్గించినట్టు కనిపించినా మళ్లీ ఈ అంతకుమించి సినిమాతో అవకాశాలు రావడం ఖాయమని అంటున్నారు. అయితే కేవలం అందానికే ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఈ సినిమాలో తనకు అభినయానికి ప్రాధాన్యత దొరికిందని సంతోషిస్తుంది రష్మి.

గుంటూర్ టాకీస్ తో తన మీద పడిన హాట్ ఇమేజ్ ను చెరిపేసుకోవాలనే ప్రయత్నంలో అమ్మడు లీడ్ క్యారక్టర్స్ లో నటించాలని అనుకుంటుందట. అంతేకాదు కుదిరితే ఐటం సాంగ్స్ తో కూడా అలరించేందుకు రెడీ అన్నట్టు సిగ్నల్స్ ఇస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: