రానా ఫస్ట్ హీరోయిన్ గుర్తుందా.. అదేనండీ రిచా గంగోపాధ్యాయ.. ఆ సినిమా తర్వాత నాగవల్లి, మిరపకాయ్, సారొచ్చారు, మిర్చి వంటి సినిమాలతో బాగానే పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాలను కొన్నాళ్లుగా పక్కకు పెట్టి చదువుపై దృష్టి సారించింది. సినిమాలదేముంది ఎప్పుడైనా చేసుకోవచ్చు అనుకుందో ఏమో..
ఇంతకీ ఏం చదివిందనుకుంటున్నారు.. ఇటీవల హీరోయిన్లందరూ సినిమాలు తగ్గిపోయాక ఏదో ఒక బిజినెస్ పెడుతున్నారు. కొందరు హీరోయిన్ గా బిజీగా ఉండగానే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. అందుకేనేమో రిచా ఎంబీఏ చదివింది. అది కూడా అమెరికాలోని సెయింట్ లూయిస్ లోని వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టాపూర్తి చేసింది.
ఇటీవలే కోర్టు సక్సస్ ఫుల్ కంప్లీట్ చేసుకున్న ఈ అమ్మడు.. ఆ సందర్భంగా దిగిన ఓ ఫోటోతో ట్విట్టర్లో తన సంతోషం పంచుకుంది. మరి చదువు అయిపోయింది కనుక మళ్లీ సినిమాలవైపు వచ్చే అవకాశం ఉండొచ్చు. ఏదేమైనా సినిమాలపైనే కాకుండా చదువుపైనా శ్రద్ధ పెట్టి ఎంబీఏ పూర్తి చేసిన రిచాను అభినందించాల్సిందే.