టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబు మూవీని చేస్తున్నారు. ఆ తరవాత వెంటనే మరో క్రేజీ ప్రాజెక్ట్ కి కొరటాల శివ రెడీ అయ్యారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘జై లవ కుశ’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ తన 29వ ప్రాజెక్ట్ ఎవరితో అనేది కూడా అనౌన్స్ చేయబడింది.


డైరెక్టర్ కొరటాల శివ తో తారక్ 29వ సినిమాని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈసారి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే కథ చాలా పవర్ ఫుల్ గా ఉండనందని అంటున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘జనతాగ్యారేజ్’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మహేష్ బాబుతో చేస్తున్న మూవీని కొరటాల శివ అనుకున్న షెడ్యూల్స్ కంటే త్వరగా పూర్తి చేయనున్నట్టు తెలుస్తుంది.


ఇప్పటికే కొరటాల శివ, మహేష్ బాబు మూవీకి సరిపడే లొకేషన్స్ ని రెడీ చేసుకున్నారు. కేవలం మూడు నెలల్లో ఈ మూవీని పూర్తి చేయటమే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులను సైతం పూర్తి చేయనున్నాడని తెలుస్తుంది. ఇదే విషయాన్ని ప్రిన్స్ మహేష్ బాబుకి కొరటాల శివ క్లియర్ గా చెప్పారంట. కథ విషయంలో చాలా స్పష్టంగా ఉండటంతో ఈ మూవీ చాలా వేగంగా పూర్తవుతుందని చెప్పారంట. దీంతో క్వాలిటీ విషయంలో మహేష్ బాబు కాస్త కంగారు పడుతున్నట్టుగా తెలుస్తుంది.


కొరటాల శివ ను ఇంకాస్త టైం తీసుకొని మూవీ కోసం ఎక్కువ పనిచేయాల్సిందిగా చెప్పారంట. కానీ కొరటాల శివ మాత్రం కథ మీద కాన్ఫిడెంట్ ఉందని..తను మరో మూవీకి కమిట్మెంట్ ఇచ్చానని చెప్పటంతో మహేష్ బాబు ఈ విషయంలో కాస్త నిరుత్సాహంగా ఉన్నారని అంటున్నారు. మొత్తానికి మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం పూర్తి కాకముందే ఎన్టీఆర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి...మహేష్ బాబుకి నిద్రలేకుండా చేస్తున్నాడని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: