యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ జై లవకుశ. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. ‘జై లవ కుశ’ ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే సంచలనాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీలో ఎన్టీఆర్ చేస్తున్న మూడు పాత్రల తీరు చాలా అద్భుతమైన నటనని కనబరుస్తారని అంటున్నారు.

అయితే బయటకు వచ్చిన ఒక పాత్ర లుక్ మూడు పాత్రల్లో ఏ పాత్ర లుక్ అయ్యుంటుందో అనే ఆలోచనలో అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన కథ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీని షేకింగ్ చేస్తుంది. ఈ మూవీలో రాజకీయ పార్టీకి సంబంధించిన కొన్ని సీన్స్ ఉన్నాయని అంటున్నారు. అయితే తెలుగుదేశ రాజకీయాలకి సంబందించిన కొన్ని కీలకసీన్స్ ని ఇందులో చిత్రీకరించారనేది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సమాచారం.

కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. నందమూరి అన్నదమ్ములు కలిసి చేస్తున్న ఈ సినిమాలో బాబుకి వ్యతిరేకంగా పొలిటికల్ సీన్స్ ఉంటాయా? అనే డౌట్ అందరిలో వస్తున్నాయి. అయితే ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో ఉన్న పొలిటికల్ సీన్స్ నిజంగా టిడిపి పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా ఉంది అని అంటున్నారు.

మొత్తంగా జై లవకుశ మూవీ పోస్టర్లో ఎన్టీఆర్ సంకెళ్లతో, వెనుక సింబాలిక్ గా రావణాసురుడి విగ్రహం ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనాలకి దారి తీస్తుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన కథ విషయంలో తెలుగు తమ్ముళ్ళు కాస్త ఆరా తీసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కళ్యాణ్ రామ్ తో కొంత మంది పార్టీ నాయకులు సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేత థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: