సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ స్పైడర్. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు నిర్మిస్తున్నారు. ముందు సినిమాను 80 నుండి 90 కోట్లలో ఫినిష్ చేయాలని అనుకున్నారు. కాని ఇప్పటికే 120 కోట్ల దాకా పెట్టేశారట.


ప్రస్తుతం టాకీ పార్ట్ అంతా పూర్తి చేసుకున్న ఈ సినిమా కేవలం రెండు పాటలనే షూట్ చేయాల్సి ఉందట. అందులో ఒకటి ఫారిన్ లొకేషన్స్ లో అయితే మరోటి హైదరాబాద్ స్టూడియోలో చేస్తారట. ఇక ఇదే కాకుండా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా పని పెండింగ్ ఉందట. దాని కోసమే బడ్జెట్ ను మరో 10 కోట్లు పెంచేస్తున్నారట దర్శక నిర్మాతలు.


ఈ 10 కోట్లతో కలిసి మహేష్ స్పైడర్ బడ్జెట్ 130 కోట్లకు చేరుకుంది. సౌత్ లో బాహుబలితో పోల్చకుంటే ఈ రేంజ్ బడ్జెట్ పెట్టడం స్పైడర్ మూవీకే అని చెప్పాలి. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా హింది భాషలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అందుకే బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు.


బాహుబలితో తెలుగు సినిమా మార్కెట్ పెరిగిందని చెప్పడంలో సందేహం లేదు. బాహుబలి బిగినింగ్ టైంలో కూడా ఆ సినిమా తర్వాత వచ్చిన మహేష్ శ్రీమంతుడు సూపర్ హిట్ అయ్యింది. ఇక ఆ సెంటిమెంట్ తోనే మురుగదాస్ స్పైడర్ కూడా కచ్చితంగా రికార్డ్ కలక్షన్స్ వసూళు చేస్తుందని అంటున్నారు. మరి సినిమా ఏ రేంజ్ వసూళ్లను సాధిస్తుందో చూడాలి. ప్రస్తుతం జూన్ నుండి ఆగష్టుకి పోస్ట్ పోన్ అయిన స్పైడర్ రిలీజ్ డేట్ మాత్రం కన్ఫాం చేయలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: