నందమూరి యువ హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నిర్మాతగానూ, హీరోగానూ పలు మూవీలను చేస్తున్నారు. తను నిర్మాతగా బిజీ ఉన్నప్పటికీ...హీరోగా మంచి కథలను మాత్రం ఎంచుకుంటున్నారు. ఆ విధంగా ప్రస్తుతం కొత్త దర్శకుడు జయేంద్ర దర్శకత్వంలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించనున్నాడు. ఈ చిత్రం జూన్ లో ప్రారంభంకానుంది.


ఇక ఈ మూవీకి సైతం తమిళ పాపులర్ రచయితలు పనిచేయనున్నారు. తనీఒరువన్, కావాన్, ఐ, అనేగన్ చిత్రాలకు రచయితలుగా పనిచేస్తున్నారు. తొలిసారి వీరిద్దరూ తెలుగు చిత్రానికి రచయితలుగా పనిచేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అలాగే ఈ మూవీతో పాటు మరో మూవీని సైతం లైన్ లో పెడుతున్నారు.


స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ నటించేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీని కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో అతనొక్కడే మూవీ వచ్చింది. ఈ మూవీ కళ్యాణ్ రామ్ కి మంచి పేరును తీసుకువచ్చింది. చాలా కాలం తరువాత మళ్ళీ వీరి కాంబినేషన్ లో మూవీ రావటంతో ఈ మూవీపై ఇండస్ట్రీలోనూ అంచనాలు ఉన్నాయి.


అయితే తాజాగా సురేందర్ రెడ్డి, కళ్యాణ్ రామ్ మూవీకి నో చెప్పినట్టుగా తెలుస్తుంది. సురేందర్ రెడ్డి ప్రస్తుతం మెగాస్టార్ తో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తరువాత బిగ్ స్టార్ తో సురేందర్ రెడ్డి మూవీని చేసేందుకు కమిట్ అయ్యారని తెలుస్తుంది. అందుకే కళ్యాణ్ రామ్ కి సురేందర్ రెడ్డి నో చెప్పటం తో ప్రస్తుతం ఇది హాట్ టాపిక గా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: