తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడిగా నటన, డ్యాన్స్, ఫైట్స్ లో తనకంటూ ప్రత్యేకత ఏర్పాటు చేసుకున్నాడు. గత మూడు సంవత్సరాల నుంచి వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టాడు. తాజాగా బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కి మంచి క్రేజ్ లభించింది. ఈనెల 26న రంజాన్ కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించు కొని జై లవకుశ టీజర్ ని రిలీజ్ చేయడానికి సమాయత్తం అవుతోంది చిత్ర యూనిట్.
ఆ మద్య కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ రంజాన్ కి టీజర్ రిలీజ్ చేశారు. ఇదే సెంటిమెంట్ మరోసారి వర్క్ ఔట్ చేయాలనే ఆలోచనలో ఎన్టీఆర్ ‘జై లవకుశ’ కి సంబంధించిన టీజర్ రిలీజ్ చేయాలనుకుంటున్నాడట. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా , నివేదా థామస్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు .
బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఎన్టీఆర్ నటిస్తున్న మూడు పాత్రలలో ఒకటి నెగెటివ్ షేడ్ తో ఉండటం గమనార్హం . జనతా గ్యారేజ్ రిలీజ్ అయిన సెప్టెంబర్ 1 నే జై లవకుశ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి రంజాన్ సెంటిమెంట్ బాగా కలిసి వచ్చిందని ఎన్టీఆర్ అభిమానులు అనుకుంటున్నారు.