తెలుగు ఇండస్ట్రీలో వారసత్వపు హవా నడుస్తున్న తరుణంలో ప్రముఖ దర్శకులు ఈవివివ సత్యనారాయణ తనయుడు అల్లరి నరేష్ ‘అల్లరి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  తన మొదటి సినిమా ‘అల్లరి’ తన పేరు ముందు పెట్టుకొని అల్లరి నరేష్ గా పాపులర్ అయ్యారు.  ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్ తర్వాత కామెడీ హీరో అంటే ఒక్క నరేష్ అని చెబుతారు.   ‘సుడిగాడు’ చిత్రం తర్వాత నరేష్ కి పెద్దగా హిట్ సినిమాలు ఏవీ లేవు.


తాజాగా అల్లరి నరేష్  నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. నిఖిల విమల్ కథానాయిక. జి.ప్రజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక్క పాట మినహా చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను  ప్రముఖ దర్శకుడు స్వర్గీయ ఈవీవీ సత్యనారాయణ జయంతి సందర్భంగా శనివారం (జూన్ 10న) విడుదల చేశారు.

Image result for evv satyanarayana

ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ  నవ్యమైన కథ కథనాలతో దర్శకుడు చిత్రాన్ని చక్కగా రూపొందిస్తున్నాడు.  గమ్యం శంభో శివ శంభో తర్వాత అలాంటి శక్తివంతమైన కథతో నరేష్ చేస్తున్న చిత్రమిది.   రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లే హైలైట్‌గా వుంటుంది. థ్రిల్లింగ్ అంశాలు వుంటూనే  నరేష్ శైలి వినోదం వుంటుంది. నరేష్‌ను కొత్త కథలో చూడాలనుకునే వారికి ఈ సినిమాతో ఆ లోటు తీరిపోతుంది. నేడు స్వర్గీయ ఈవీవీ జయంతి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాం. 


ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, తులసి, సుధ, సత్యం రాజేష్, మధునందన్, జబర్దస్త్ ఆది, పద్మ జయంతి, రవిప్రకాష్, వెన్నెల రామారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: చంద్రశేఖర్ (పిల్ల జమీందార్ ఫేమ్), సినిమాటోగ్రఫీ: ఉన్ని ఎస్ కుమార్, సంగీతం: షాన్ రెహమాన్, ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటర్: నందమూరి హరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్, సమర్పణ:  శ్రీమతి నీలిమ, నిర్మాత: బొప్పన చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ప్రజిత్.

మరింత సమాచారం తెలుసుకోండి: