"ది బెస్ట్ టాలీవుడ్ హిట్ పెయిర్" గా పేరు తెచ్చుకున్న ప్రభాస్, అనుష్క జంట మరోసారి జట్టుకట్టాల్సిందే అంటుంది సాహో టీం. వీరిద్దరూ కలిసి ఇప్పటికి నాలుగు సినిమాల్లో నటించారు. అవన్నీ అద్భుత విజయాలే, బ్లాక్-బస్టర్సే ఆర్ధిక విజయాలు కూడా సాధించడం విశేషమే. "బిల్లా" చిత్రంతో కలిసిన ఈ జంట బాహుబలి–ది కంక్లూజన్ వరకూ విజయపథం పై నల్లేరుపై నడకలా కొనసాగింది.
ఈ మేడ్ ఫర్ ఈచ్ అథర్ లా ముచ్చట గొలిపే జంటపై అనెక సార్లు ప్రేమ వదంతులు ఉప్పెనలా వచ్చాయి. దానికి వీరు చూడముచ్చటగా ఉండటం కూడా బలమైన కారణం కావచ్చు. వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మీడియాలో తరచుగా హోరెత్తుతోంది. ఇప్పటి వరకూ దక్షిణాదికే పరిమితం అయిన "ప్రభాస్-అనుష్క క్రేజ్" బాహుబలి– 2తో విశ్వవ్యప్త స్థాయికి చేరింది. ఇకపోతే "బాహుబలి ఫీవర్" నుంచి బయట పడ్డ ప్రభాస్ యూవీ క్రియేషన్స్ సంస్థ రూ. 150 కోట్ల భారీ బడ్జెట్తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న "సాహో" చిత్రంలో నటిస్తున్నాడు.
చాలాకాలం క్రితమే లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం ఈ మెల 11వ తేదీ అంటే శనివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఇప్పటికీ ఇందులో నటించే కథానాయకి ఎంపిక జరగలేదు. ఇది త్రిభాషా చిత్రం కావడంతో బాలీవుడ్ బ్యూటీ అయితే బాగుంటుందని చిత్ర వర్గాలు భావించినట్లు సమాచారం. అయితే సాహో చిత్రంలో నటించడానికి బాలీవుడ్ భామలెవరూ సెట్ కానట్టుగా తెలుస్తున్ది. కొందరు కాల్షీట్స్ సమస్య కారణంగా అంగీకరించలేదని,మరి కొందరు అధిక పారితోషికం డిమాండ్ చేయడంతో వారిని దర్శక, నిర్మాత లు పక్కన పెట్టినట్లు ప్రచారం జరిగింది. దీంతో "సాహోలో ప్రభాస్ పక్కన అనుష్కనే బెస్ట్ ఛాయిస్" అనే భావనకు ఆ చిత్ర వర్గాలు వచ్చినట్లు ప్రస్తుత సమాచారం.
బాహుబలి–ది కంక్లూజన్ తరువాత ఈ స్వీటి అనుష్క మరే కొత్త చిత్రాన్ని అంగీకరించలేదు. అంతకు ముందు ప్రారంభమైన భాగమతి చిత్రాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉంది. దీంతో బాహుబలి సినిమా క్రేజ్ను సాహో చిత్ర యూనిట్ వాడుకోవ డానికే సిద్ధం అయినట్లు సినీ వర్గాల సమాచారం. అయితే దీని గురించి అధికార పూర్వక ప్రకటన వెలువడాల్సి ఉంది.
దేవుడెలా రాస్తే అలానే జరుగుతుంది. ఇద్దరూ తప్పించుకుందామన్నా ఇద్దర్లో ఒక్కరు తప్పించుకుందామన్నా "వీరే జంట కట్టాలని ఆయన రాస్తే ఇక అంతే మరి. అలా రాసిపెట్టి ఉందేమో?" ఏమంటావ్ స్వీటీ!....ప్రభాస్!