స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో సినిమాలో నటించిన కేథరిన్ త్రెసా ఆ సినిమాతో హాట్ ఇమేజ్ సంపాదించినా దాన్ని ఎందుకో నిలబెట్టుకోలేకపోయింది. బన్నితోనే రుద్రమదేవి, సరైనోడులో కూడా నటించిన కేథరిన్ ఆ తర్వాత కోలీవుడ్ లో కూడా సినిమాలు చేసింది. అక్కడ కూడా తనను ఎవరు పట్టించుకోవట్లేదట. అందుకే ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది.


మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైది నంబర్ 150 సినిమాలో రత్తాలు సాంగ్ కేథరిన్ చేయాల్సిందే. కాని ఆ సినిమా షూటింగ్ టైంలో సెట్ లో గొడవపడి మరి అమ్మడు ఆ ఛాన్స్ మిస్ చేసుకుంది. రత్తాలు పాట కేథరిన్ చేసుంటే పరిస్థితులు ఎలా ఉండేయో కాని ప్రస్తుతం కేథరిన్ గోపిచంద్ హీరోగా సంపత్ నంద్ డైర్కషన్ లో వస్తున్న గౌతం నంద సినిమాలో నటిస్తుంది. 


చేతిలో ఉన్న సినిమా ఇదే కాబట్టి సాధ్యమైనంత వరకు సినిమాలో హాట్ లుక్స్ తో కనిపించిందట కేథరిన్. సినిమా మొత్తం తన గ్లామర్ షోతో అదరగొట్టేసిందని టాక్. ఇక ఇదే కాకుండా తేజ డైరక్షన్ లో వస్తున్న నేనే రాజు నేనే మంత్రి సినిమాలో కూడా కేథరిన్ రాంతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఇద్దరమ్మాయిలతో సినిమా చూశాక అమ్మడు తెలుగులో స్టార్ ఇమేజ్ సంపాదించడం ఖాయమని అనుకున్నారు. కాని ఆమె చూపించే యాటిట్యూడ్ వల్ల కేథరిన్ కు అవకాశాలు రాకుండా చేశాయి. మరి గౌతం నంద మూవీ కేథరిన్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: