తెలుగు సాహితీ రంగానికి తెలుగు సినిమా పాటలకు ఎంతో సేవ చేసిన సి నారాయణ రెడ్డి మరణానికి ప్రపంచంలోని ప్రతి తెలుగు వాడి గుండె స్పందించింది. అయన కలం మూగబోయింది అన్న వార్తకు  తెలుగు సినిమా రంగంలోని ప్రతీవ్యక్తి  అత్యంత భారమైన గుండెతో ఆ మహోన్నత వ్యక్తికి నీరాంజనాలు అర్పిస్తున్నారు. 

ఇలాంటి విషాదకర సమయంలో నారాయణ రెడ్డి అభిమానులకు ఒక ఊరట కలిగించే వార్త బయటకు వచ్చింది. సినారె వెళ్లిపోయినా ఆయన అందించిన మరో పాట వినే అవకాశం తెలుగు సినీ ప్రేక్షకులకు  త్వరలో దక్కనుంది. "నెల వంక తొంగి చూసింది అనే పాట మాకు అందించి నెల తిరక్క ముందే తెర మరుగైన నిండు పౌర్ణమి సి నారె గారికి మా అశ్రు నివాళి" అంటూ సి నారాయణ రెడ్డికి ఎంతో ఘనంగా నివాళి ఘటించింది 'నేనే రాజు నేనే మంత్రి' మూవీ యూనిట్. ఈ మూవీకోసం సినారె అందించిన పాట బహుశా చివరిది అన్న వార్తలు వస్తున్నాయి. 

ఈనాటితరం ప్రేక్షకులకు నారాయణ రెడ్డి పాటలలోని సొగసులు విరుపులు పెద్దగా పరిచియం లేకపోయిన నేపధ్యంలో ఆయన పెన్ను నుంచి జాలువారిన ఈ పాట ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో  వినిపించ బోతున్న నేపధ్యంలో ఆయన కలం నుండి జాలువారిన ఆ ఆఖరు పాటకోసం చాలామంది ఎదురు చూస్తున్నారు.
 
'ఎంతో అద్భుతమైన ఓ ప్రయాణం ముగిసింది. ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది' అంటూ మూవీ షూటింగ్ ఆఖరి దశకు చేరుకున్నట్లు దర్శకుడు తేజా తన ట్విట్ లో తెలియచేసాడు.  తేజ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందిన ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్న నేపధ్యంలో రానా క్రేజ్ తో ఈమూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: