నిన్న విడుదల అయిన రానా లేటెస్ట్ మూవీ ‘నేనే రాజు నేనే మంత్రి’ ట్రైలర్ విడుదల అయిన కొద్ది గంటలకే తెలుగుదేశం  పార్టీ వర్గాలలో గుబులు పుట్టిస్తోంది అన్న గాసిప్పులు వినపడుతున్నాయి. ‘లీడర్’ లాంటి పొలిటికల్ మూవీతో తన కెరియర్ ప్రారంభించిన రానా చాలాకాలం హీరోల రేస్ లో చాల వెనుక పడిపోయాడు. 

అయితే ‘బాహుబలి’ ప్రాజెక్ట్ తో నేషనల్ స్టర్ గా మారిపోయిన రానా ప్రస్తుతం తేజా దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ ఒక పొలిటికల్ థ్రిల్లర్ ని పోలి ఉంటుంది అన్న వార్తలు ఇప్పటికే ఉన్నాయి. ఈసినిమా ట్రైలర్ అందరి దృష్టిని ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

ఇది ఇలా ఉండగా ఈ ట్రైలర్ లోని ”సిఎం అయితే ఎవడికి గొప్ప. వందమంది ఎమ్మెల్యేలను స్టార్‌ హోటల్‌కి తీసుకు వెళ్ళి దాస్తే  నేను ముఖ్యమంత్రినే” అని రానా పలికిన డైలాగ్ సరిగ్గా ఇప్పుడు తెలుగుదేశ పార్టీ వర్గాలలో తీవ్ర చర్చలకు దారితీసి ఒకనాటి నందమూరి తారకరామారావుకు జరిగిన వెన్నుపోటు సంఘటను గుర్తుకు చేసేలా ఉంది అన్న కామెంట్స్ తమలో తాము చేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

అయితే ఇప్పుడు ఈ ట్రైలర్ లోని ఈ డైలాగ్ చాలామందికి రీచ్ అయి ఈసినిమా పై అంచనాలు పెంచుతున్నా చిట్టచివరకు ఈ డైలాగ్ సెన్సార్ కత్తేరను దాటుకుని సినిమాలో ఫైనల్ గా వినిపిస్తుందా అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రానా ‘నేనే రాజు నేనే మంత్రి’ విడుదల కాకుండానే సంచలనాలకు చిరునామాగా మారినట్లు  అనిపిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: