‘బాహుబలి’ ప్రాజెక్ట్ తో నేషనల్ స్టార్ గా మారిపోయిన రానా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నేనే రాజు నేనే మంత్రి’ కి ఎవ్వరూ ఊహించని విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ రావడమే కాకుండా ప్రస్తుతం ఆ సినిమాకు బయ్యర్ల నుండి వస్తున్న ఆఫర్లు టాప్ యంగ్ హీరోలను కూడ ఆశ్చర్య పరుస్తోంది. డైరెక్టర్‌ తేజని టాలీవుడ్ ఇండస్ట్రీ   ఏనాడో మర్చిపోయింది. 

తేజ లాస్ట్‌ హిట్‌ వచ్చి దాదాపు 15 ఏళ్ళు అవుతోంది. ప్రస్తుతం టాప్ దర్శకులుగా పేరుపొందిన చాలమంది దర్శకుల కంటే తేజా చాలా సీనియర్. కొత్త వాళ్ళతో ‘జయం’ లాంటి హిట్ మూవీని చేసిన తరువాత తిరిగి అటువంటి హిట్ సాధించాలని గత దశాబ్ద కాలంగా తేజ ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. ఆ ప్రయోగాలు అన్నీ విఫలం అవ్వడంతో తేజ పట్ల ఏ హీరో ఆసక్తి కనపరచక పోవడమే కాదు ఈ దర్శకుడు కలవాలని ప్రయత్నిస్తే చాలామంది హీరోలు కనీసం టైం కూడ ఇవ్వలేదు అన్న విషయాన్ని స్వయంగా తేజా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. 

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం తేజా రానా తో తీసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా కథను చాల సంవత్సరాల క్రితమే వ్రాసుకున్నట్లు టాక్. ఆ కథను పుచ్చుకుని తేజ చాలామంది హీరోలకు చెప్పాలని ప్రయత్నించినా కనీసం ఆ కథను కూడ వారు వినలేదని తెలుస్తోంది. దీనితో తేజ తన చిరకాల మిత్రుడైన సురేష్ బాబు చుట్టూ తిరిగి కష్టపడి రానా డేట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 

అయితే రానా తేజా సినిమాలో చేయడం చూసిన చాలామంది ‘బాహుబలి’ తో వచ్చిన క్రేజ్ ను రానా ఎందుకు పాడుచేసుకుంటున్నాడు అంటూ కామెంట్స్ చేసుకున్నట్లు టాక్. అయితే ఈ మూవీ ట్రైలర్ విడుదల అయ్యాక ఈ ట్రైలర్ కు ఒక్కరోజులోనే ఐదు మిలియన్ వ్యూస్ రావడం చూసి ఒక మంచి కథను అనుకోకుండా పోగొట్టుకున్నామా అంటూ చాలామంది టాప్ హీరోలు బాధ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి..    
 


మరింత సమాచారం తెలుసుకోండి: