బాలీవుడ్ ఇండస్ట్రీలో షారూఖ్ ఖాన్ అంటే ఇప్పుడు ఓ సంథింగ్ స్పెషల్. నటుడు,వ్యాఖ్యాత,వ్యాపారవేత్తగా అన్ని రంగాల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తాజాగా షారూఖ్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 25 ఏళ్లు పూర్తయింది. 1992లో దీవానా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు షారుక్. బాలీవుడ్లోకి రాకముందు ఫౌజీ, సర్కస్లాంటి టీవీ సీరియల్స్లో అతను నటించాడు. దీవానా తర్వాత డర్, బాజిగర్, అంజామ్లాంటి సినిమాల్లో నెగటివ్ రోల్స్లో కనిపించాడు షారుక్.
మొదట నెగిటీవ్ రోల్స్ లో వచ్చి తర్వాత హీరోగా మారిన వారు చాలా మంది ఉన్నారు..ఇదే మనోడికి కలిసి వచ్చింది. ఇక షారూఖ్ నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, మొహబ్బతేలాంటి రొమాంటిక్ సినిమాల్లో నటించి అభిమానులకు మరింత చేరువయ్యాడు. ఇక 1995 అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ముంబయి మరాఠా మందిర్ థియేటర్లో దాదాపు 20 సంవత్సరాలు నడిచింది. దీంతో బాలీవుడ్ లో షారూఖ్ లవర్ బోయ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు.
25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్విట్టర్లో షారుక్ తన ఫ్యాన్స్కు థ్యాంక్స్ చెప్పాడు. హిందీ సినిమా ఇండస్ట్రీకి షారుక్ అందించిన సేవలకుగాను అతన్ని పద్మశ్రీతో సత్కరించింది భారత ప్రభుత్వం. అటు గవర్నమెంట్ ఆఫ్ ఫ్రాన్స్ కూడా రెండు అత్యున్నత అవార్డులతో అతనికి తగిన గుర్తింపునిచ్చింది. ఇన్నేళ్లుగా నన్ను భరించినందుకు థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు.ప్రస్తుతం షారుక్ తన లేటెస్ట్ మూవీ జబ్ హ్యారీ మెట్ సెజాల్ ప్రమోషన్ వర్క్లో ఉన్నాడు. ఈ మూవీ ఆగస్ట్ 4న రిలీజ్ కానుంది.
షారూఖ్ ట్విట్ :