తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు అరడజను మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు.  అయితే మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత గొప్ప మాస్ ఫాలోయింగ్ మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కి మాత్రమే దక్కింది.  అయితే చిరంజీవి తనయుడు రాంచరణ్ చేసినవి కొన్ని చిత్రాలే అయినా దాదాపు ఒకటీ రెండు తప్పా అన్ని సూపర్ హిట్ చిత్రాలే..ఇక మెగాస్టార్ అల్లడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన డ్యాన్స్, ఫైట్స్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు.  

ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ ముగ్గురు హీరోలు నెంబర్ వన్ రేస్ లో ఉన్నారు.  అయితే గత మూడు సంవత్సరాల క్రితం ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా హీరోలుగా తమ సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్నారు.  అయితే వరుణ్ తేజ్ వరుస విజయాలతో దూసుకు వెళ్తుంటే..వరుణ్ తేజ్ మాత్రం '' లోఫర్ '' , '' మిస్టర్ '' చిత్రాలతో పూర్తిడా ఢీలా పడ్డాడు.  

నిన్న సాయంత్రం హైదరాబాద్ లో '' ఫిదా '' ఆడియో వేడుక జరిగింది . ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ..ఇంతకుముందు తెలిసో తెలియకో రెండు మూడు తప్పులు చేశాను , ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నాను ఇకపై ఆ తప్పులు చేయను అని అభిమానులకు మాటిస్తున్నాడు.  

తన కెరీర్ లో  '' ముకుంద '' , ''కంచె '' చాలా అద్భుతమైన చిత్రాలని అలాంటి స్టోరీ కంటెంట్ ఉన్న చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని ఈ సారి మెగా ఫ్యాన్స్ ని నిరుత్సాహ పర్చనని అన్నాడు. ఇక ఇప్పుడేమో ఫిదా చేస్తున్నాడు ఈనెల 21 న ఆ సినిమా రిలీజ్ అవుతోంది . మరి ఈ సినిమా ఏమౌతుందో చూడాలి . 



మరింత సమాచారం తెలుసుకోండి: