తెలుగు ఇండస్ట్రీలో హ్యాట్రిక్ విజయాలతో దూసుకు వెళ్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటి సారిగా బుల్లితెరపై కనిపించి కనువిందు చేస్తున్నాడు.   ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించిన ‘బిగ్ బాస్’ షో ఇప్పుడు తెలుగు బుల్లితెరపై వస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా  బిగ్ బాస్ షో ఎపిసోడ్ 4తో సందడి చేశారు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సెలబ్రిటీలు. బిగ్ బాస్ షో అంటే అందులో ఉన్న కంటెస్టెంట్స్ రక రకాల స్వభావాలు కలిగిన వ్యక్తులు ఉంటారు..ఒక్కో విషయంలో వారికి విభేదాలు రావడం గొడవలు పడటం లాంటివి జరుగుతుంటాయి.  


అయితే ఇప్పటి వరకు తెలుగు లో వచ్చిన బిగ్ బాస్ షోలో అక్కడక్కడా అడపాదడపా వచ్చిన చిన్న వివేదాలే తప్ప తారాస్థాయిలో జరిగిన వివాదలు లేవు. కాకపోతే మొన్న ఆదర్శ్  మాత్రం కొద్దిగా హడావిడి చేశాడు.  టీవి చూస్తున్న ప్రేక్షకులను కాస్త టెన్షన్ పెట్టాడు..ఉన్నట్టుండి హిస్టీరియా వచ్చినవాడిలా ప్రవర్తించి ధన్ రాజ్ మెడను కొరికినట్లు చేసి..రూమ్ లోకి వెళ్లి నాకు మందు కావాలని గొడవ చేసి..బయటకు వచ్చి చెప్పు స్విమ్మింగ్ ఫుల్ లో వేసి నానా హంగామా చేశాడు. తర్వాత అదంతా జస్ట్ ఫర్ ఫన్నీ అంటూ కొట్టిపడేశాడు.


నిన్న అదర్శ, ప్రిన్స్, హరితేజ ల మద్య గొడవ చిన్న చిన్నగా రాజుకొని పెద్దదే అయ్యింది.  ఆ తర్వాత హరిప్రియ కన్నీరు పెట్టుకుంది. ఇక హరిప్రియ  విషయంలో కల్పన జోక్యం చేసుకొని మనం ఒకేదగ్గర కొంత కాలం గడపాలి కనుక తప్పు ఏదైనా ఉంటే సారీ చెప్పు..లేదంటే క్షమించు అని చెప్పడంతో..హరితేజ, ప్రిన్స్ మద్య రాజీకుదిరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: