సినిమా అంటే అదో రంగుల ప్రపంచం అని అనుకుంటారు..కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక ఎంతో మంది శ్రమ దాగి ఉంటుంది.  ఒక్క సినిమా తెరపైకి రావాలంటే లైట్ బాయ్ నుంచి దర్శకులు, నటులు ఎంతో మంది కష్టపడాలి.  కొన్ని సార్లు సినిమా షూటింగ్స్ ఔట్ డోర్ లో ఉంటాయి..అలాంటి లోకేషన్స్ లో ఎన్ని జాగ్రత్తలు వహించినా కొన్ని సార్లు ప్రమాదాలు జరగుతూనే ఉంటాయి.  

ఈ మద్య హీరో విష్ణు బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయాలై ఐసీయూ లో చికిత్స పొందారు.  తాజాగా హాలీవుడ్ లో ఓ విషాదం చోటుచేసుకుంది.  డెడ్‌పూల్‌ పార్ట్ 2 షూటింగ్  సందర్భంగా ఓ లేడీ స్టంట్ మాస్టర్ బైక్ యాక్సిడెంట్ లో మృతి చెందింది. సోమవారం బ్రిటీష్ కొలంబియాలోని వాన్‌కవర్‌ కన్వెన్షన్ సెంటర్ వద్ద సినిమాకు సంబంధించి ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ ను చిత్రీకరించేందుకు సిద్ధమయ్యారు.
Image result for vishnu accident
స్టంట్ మాస్టర్ ఓయ్‌ ఎస్‌జే హర్రిస్‌ రిహార్సల్‌ చేస్తోంది. అయితే బేగంగా నడుపుకుంటూ వస్తున్న మహిళా స్టంట్‌ మాస్టర్‌ మూలమలుపు వద్ద సిగ్నల్ క్రాస్ చేసింది..అదే సమయంలో బైక్ స్లిప్ కావండంతో ఒక్కసారూ ముందుకు దూసుకు వెళ్లి.. ఓ మాల్‌ లోని తలుపులను ఢీకొట్టింది. తీవ్రమైన గాయాలు కావడంతో  మహిళా స్టంట్‌ మాస్టర్‌ మృతి చెందారు.

ఈ విషయాన్ని నటుడు ర్యాన్ రెనాల్డ్స్‌ తన ట్విట్టర్ లో తెలియజేశారు. ఆ మద్య కన్నడ ఇండస్ట్రీలో కూడా ఇద్దరు స్టంట్ మాస్టర్లు తగు జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల హెలికాప్టర్ నుంచి దూకి ఓ నదిలో కొట్టుకుపోయి శవాలుగా తేలారు. భద్రతా చర్యలు పాటించకపోవటం మూలంగానే షూటింగ్ లలో తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: