రాంచరణ్ నటించిన బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ను తెరకెక్కించింది రిలయన్స్ ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్ పవర్స్టార్ నటించిన అత్తారింటికి దారేది మూవీలోనూ రిలయన్స్ స్లీపింగ్ పార్టనర్. జంజీర్ మూవీ కలెక్షన్లను టాలీవుడ్లోనూ కొల్లగొట్టాలంటే పవన్ నటించిన అత్తారింటికి దారేది మూవీ ఖచ్చితంగా ఆగష్టునెలలోనే రిలీజ్ కావాలి. కాదని డేట్ మార్చితే ఆ ఎఫెక్ట్ చరణ్ నెక్ట్ రిలీజ్ జంజీర్ ఫిల్మ్ మీద ప్రభావితం చూపుతుంది.
అలాగని ఎవడు మూవీను పోస్ట్పోన్ చేసుకుంటే రిలీజ్కు రెడీగా ఉన్న జంజీర్ మరో రెండు నెలలకు పోస్ట్పోన్ చేయాల్సి ఉంటుంది. ఎవడు,అత్తారింటికి దారేది ఈ రెండు మూవీలు అనుకున్న టైంకు రిలీజ్ కావాల్సిందే. జంజీర్ మూవీకు టాలీవుడ్ నుండి ఎటువంటి పోటీ ఉందకూడదు. ఇదే రిలయన్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ. అందుకే ఈ మెగాహీరోల మూవీలు డేట్స్ మార్చుకుందాం అనుకున్నా, అ రైట్స్ వారి చేతిలో లేవు. ఫలితంగా ఇద్దరూ ఒకరిపై ఒకరు పోటీ పడేవిధంగా సీన్ క్రియోట్ అయిందని ఇండస్ట్రీ టాక్.