బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే ముందు వరుసలో ఖచ్చితంగా వుండే పేరు మనిషా కోయిరాలా....స్టార్ హీరోలందరితోనూ నటించిన మనిషా అంటే ఆడియెన్స్ కే కాదు హీరోలకు కూడా అదో ఇది. అయితే టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమయంలోనే ఓ మాయగాడి వలలో పడి పెళ్లి చేసుకున్నది. ఆ తరువాత అతగాడు పెట్టిన హింసకు తట్టుకోలేక విడిపోయి విడాకులు తీసుకుంది. ..అయితే ఇలా మానసికంగా కృంగిపోతున్న టైంలోనే ఆమెకు ఓవెరియన్ క్యాన్సర్ వున్నట్టు తెలిసింది.
ఆ తరువాత మనిషా పడ్డ కష్టం అంత ఇంత కాదు. అయినా మనోదైర్యంతో న్యూయార్క్ లో మకాం వేసి క్యాన్సర్ తో కుస్తీ పట్టి మరీ సక్సెస్ అయింది. క్యాన్సర్ నుండి బయటపడిన మనిషా మంగళవారం ముంబై వచ్చింది. క్యాన్సర్ మహమ్మరి నుండి తప్పించుకున్నానని త్వరలో తన సెకండ్ ఇన్నింగ్ మొదలు కానుందని చెప్పింది. ప్రస్తుతం కధలు వింటున్నానని, క్యాన్సర్ కారణంగా గుండు చేయించుకున్నానని, సో విగ్ తో మ్యానేజ్ చేస్తానని సెలవిచ్చింది. ఎలాగైతేనేం మనిషా మళ్లీ తెరపైకి రాబోతుంది ..అది చాలు ఆమె అభిమానులకు.