కేన్స‌ర్‌తో పోరాడి గెలిచి రియ‌ల్ హీరోయిన్ అనిపించుకొంది మ‌నీషా కొయిరాలా. త‌న ఆధ్యాత్మిక చింత‌న‌, దైవ భ‌క్తి, విశ్వాసం త‌న‌ని కాపాడాయి అంటోంది మ‌నీషా. ఈ అనుభ‌వాల‌కు అక్ష‌ర‌రూపం ఇవ్వాల‌నుకొంటోంద‌ట‌. త‌న జీవితాన్ని పుస్త‌క రూపంలో తీసుకొచ్చే ప్ర‌య‌త్నాల్లో ఉంది. ``నేనేం మ‌హా మ‌నిషిని కాదు.

కానీ నా జీవితం నుంచి పాఠాలుగా తీసుకోవ‌ల‌సిన విష‌యాలున్నాయి. వాటిని అంద‌రితో పంచుకోవాల‌ని ఉంది. అందుకే నా ఆత్మ క‌థ రాసుకొందామ‌నుకొంటున్నా. దానికి ఇదే స‌రైన స‌మ‌యం`` అని చెబుతోంది. వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో ఈ పుస్త‌కం విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: